‘స్కూల్ ఠీకో కరో’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాల గురించి తెలుసుకునేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ ( సీజేపీ ) ప్రతినిధుల బృందానికి రాజస్థాన్లో చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామంలోకి రావొద్దంటూ కొంతమంది వారిని అడ్డుకుని, దాడికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనిపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందిస్తూ.. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీజేపీ కో-కన్వీర్ అశుతోష్ రంకా నేతృత్వంలో కార్యకర్తలు శుక్రవారం రాజస్థాన్లో పర్యటించారు.ఈ సందర్భంగా జైపుర్ జిల్లా రాంపురా కన్వర్పురా గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, గ్రామ శివారులోనే పలువురు వీరిని అడ్డుకుని, తమ పాఠశాలను తామే బాగు చేసుకుంటామంటూ.. బలవంతంగా అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ‘అర్బన్ నక్సల్స్’, ‘దేశద్రోహులు’, ‘పాకిస్థానీలు’ అని ఆరోపించారు. ఈ క్రమంలోనే తమపై దాడి జరిగినట్లు అశుతోష్ వెల్లడించారు. తమ కార్యకర్తలపై రాళ్లతో దాడి చేసి, తమ వాహనాలను ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూశారని, అడ్డుకునే ప్రయత్నం చేయాలని రంకా దుయ్యబట్టారు.గోశాలలో నడుస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాఠశాలను తనిఖీ చేయడానికి గ్రామస్థులు తమను ఆహ్వానించారని రాంకా పేర్కొన్నారు. ‘‘చాలా సంవత్సరాలుగా ఆ పాఠశాల గోశాలలోనే నడుస్తోంది... గత సంవత్సరం కూడా మేము అదే పాఠశాలను సందర్శించాం. ఈరోజు పర్యటన గురించి మేము పోలీసులకు సమాచారం అందించాం... కానీ బీజేపీ గూండాలు అప్పటికే అక్కడ ఉన్నారు. మా వాలంటీర్లపై దాడి జరిగింది. మా కార్లను ధ్వంసం చేశారు, ఫోన్లను పగలగొట్టారు, ఒక మహిళపై దాడి చేశారు, నా చొక్కాను చింపేశారు.. మా బృంద సభ్యులలో ఒకరి చేయి విరిగింది’’ అని దాడి అనంతరం రాంకా అన్నారు.దాడికి సంబంధించిన దృశ్యాలను సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. తమ బృందంపై దాడి వెనుక బీజేపీ పనేనని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనలో తమ కార్యకర్తలు గాయపడ్డారని