
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి ఛైర్మన్గా కొనసాగకూడదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం టాటా సన్స్ బోర్డుకు తన నిర్ణయాన్ని తెలియజేశారు. ఆయన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20న ముగియనుంది. అంటే అప్పటివరకు ఛైర్మన్గా కొనసాగుతారు. ఆగస్టు 18న జరగనున్న కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది.ఏం జరిగింది?చంద్రశేఖరన్ మరో ఐదేళ్ల పదవీకాలానికి కొనసాగింపుపై గతంలో ప్రతిపాదన వచ్చింది. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్లు ఏకగ్రీవంగా ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని సిఫార్సు చేశాయి. టాటా సన్స్ నామినేషన్, రెమ్యునరేషన్ కమిటీ, బోర్డు కూడా ఈ ప్రతిపాదనను సిఫార్సు చేశాయి.అయితే 2026 ఫిబ్రవరి 24న జరిగిన బోర్డు సమావేశంలో ఓ సభ్యుడు ఈ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వలేదు. ఏకాభిప్రాయం లేకపోవడంతో తాను నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు చంద్రశేఖరన్ తెలిపారు. ఆ సమావేశానికి ఆరు నెలలు గడిచినా ఇప్పటివరకు దీనిపై నిర్ణయం రాలేదని చెప్పారు.నాయకత్వంపై స్పష్టత అవసరంటాటా సన్స్ చాలా పెద్ద సంస్థ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. పలు కీలక వ్యూహాత్మక ప్రాజెక్టులు ప్రస్తుతం కీలక దశలో ఉన్నాయని తెలిపారు. 2027 ఫిబ్రవరి తర్వాత గ్రూప్ను నడిపించే నాయకుడు ఎవరన్న దానిపై ముందుగానే స్పష్టత ఉండటం అవసరమన్నారు. ఉద్యోగులు, పెట్టుబడిదారులు, భాగస్వాములు, ఇతర భాగస్వామ్య వర్గాలకు ఇది ముఖ్యమని చెప్పారు. అందుకే వారసుడి ఎంపికను త్వరగా పూర్తి చేయాలని బోర్డును కోరినట్లు వెల్లడించారు.‘టాటాలో 40 ఏళ్ల ప్రయాణం’తన





