
ఏపీలో మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త' అనే నినాదాన్ని నిజం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మహిళలు తక్కువ పెట్టుబడితో గౌరవప్రదమైన ఆదాయం సంపాదించేందుకు 'చాయ్ రాస్తా' పేరుతో సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. డీఆర్డీఏ-సెర్ప్ ఆధ్వర్యంలో ఈ పథకం అమలు కానుండగా, తొలి దశలో అనంతపురం జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది.ఏమిటీ 'చాయ్ రాస్తా' పథకం?రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం డీఆర్డీఏ-సెర్ప్, 'చాయ్ రాస్తా' అనే బ్రాండ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పథకం కింద ఎంపికైన మహిళలకు ఫ్రాంచైజ్ పద్ధతిలో ఆధునిక టీ స్టాల్స్ను ఏర్పాటు చేస్తారు. కేవలం టీ, కాఫీ అమ్మడమే కాకుండా బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ వంటి ఇతర చిరుతిళ్లను కూడా విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ఫ్రాంచైజ్ తీసుకున్న వారికి వ్యాపారం కోసం అవసరమైన కంటైనర్, ప్రాథమిక సరుకులు, ఇతర సామగ్రిని అందిస్తారు. అంతేగాక వ్యాపారానికి అత్యంత కీలకమైన లొకేషన్ సర్వే, అవసరమైన లైసెన్సులు, డాక్యుమెంటేషన్, మార్కెటింగ్, వ్యాపార నిర్వహణలో శిక్షణ వంటి అన్ని విషయాల్లోనూ సంస్థ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది.ప్రభుత్వం అందించే ఆర్థిక చేయూతచాయ్ రాస్తా ఏర్పాటుకు ఆసక్తి చూపే మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. డీఆర్డీఏ ద్వారా స్త్రీనిధి, ఉన్నతి, బ్యాంకు లింకేజీ వంటి పథకాల కింద