
టెలివిజన్ ఛానెళ్ల ప్రసారాల్లో ప్రకటనల సమయంపై ఉన్న కీలక నిబంధనను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. గంటకు 12 నిమిషాలు మాత్రమే ప్రకటనలు ప్రసారం చేయాలన్న పరిమితిని ఎత్తివేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. టీవీ, డిజిటల్ మీడియా మధ్య సమాన పోటీని ప్రోత్సహించడం, వ్యాపార సౌలభ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.1994 నాటి కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ నిబంధనల కింద 2006లో ఈ 12 నిమిషాల ప్రకటనల పరిమితిని ప్రవేశపెట్టారు. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు టీవీ ప్రసార రంగంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది. 2006లో దేశంలో కేవలం 62 టీవీ ఛానెళ్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 900కు పైగా ఉందని గుర్తు చేసింది.ఆ రోజుల్లో అనలాగ్ పద్ధతిలో ఉన్న కేబుల్ టీవీ ప్రసారాల వల్ల ఛానెళ్ల సంఖ్య పరిమితంగా ఉండేది. కానీ, ఇప్పుడు కేబుల్ టీవీ రంగం పూర్తిగా డిజిటలైజ్ అయింది. డీటీహెచ్, కేబుల్ టీవీ, ఐపీటీవీ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లు 300 నుంచి 500కు పైగా ఛానెళ్లను అందిస్తూ ప్రేక్షకులకు విస్తృత ఎంపికలు కల్పిస్తున్నాయి. దీనివల్ల మార్కెట్లో పోటీతత్వం గణనీయంగా పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది.భారత్లో టీవీ రంగం 'పే' లేదా 'ఫ్రీ-టు-ఎయిర్' ఛానెల్ అనే దానితో సంబంధం లేకుండా ప్రకటనల ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. మరోవైపు, డిజిటల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్లలో ప్రకటనలపై ఎలాంటి కాలపరిమితి నిబంధన లేదు. ఈ అసమాన పోటీ