© 2026 nimisham.in

Celina Jaitley Divorce News: సినీ పరిశ్రమలో నిత్యం ఏదో ఒక టాపిక్ ట్రెండ్ అవుతూ ఉంటుంది. నేటి ప్రపంచంలో ప్రేమలు, పెళ్లిళ్లు ఆ తర్వాత విడాకులు వంటివి సర్వసాధారణంగా మారాయి. అందులోనూ సినీ ఇండస్ట్రీలో ఇలాంటి పరిణామాలు చాలానే చోటుచేసుకున్నాయి. అయితే ఓ హీరోయిన్ మాత్రం తన పెళ్లి రోజునే తన భర్త విడాకులు ఇచ్చి సర్ప్రైజ్ చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. సినీ పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో.. విడాకులు కూడా అంతే మామూలు విషయంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంటలు.. ఉన్నట్టుండి విడిపోతున్నట్లు ప్రకటిస్తూ అభిమానులకు షాకిస్తున్నాయి. తాజాగా, ఒకప్పుడు టాలీవుడ్లో మెరిసిన ఒక స్టార్ హీరోయిన్ జీవితంలో జరిగిన దారుణమైన ఘటన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. పెళ్లి రోజున భర్త ఇచ్చిన 'సర్ప్రైజ్' ఆమె జీవితాన్నే తలకిందులు చేసింది. మంచు విష్ణు హీరోగా వచ్చిన 'సూర్యం' సినిమా గుర్తిందా? అందులో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన అందాల భామ సెలీనా జైట్లీ. ఆ తర్వాత టాలీవుడ్లో పెద్దగా కనిపించకపోయినా, బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పీక్లో ఉన్న సమయంలోనే ఆమె వివాహం చేసుకుంది. 2011లో ప్రముఖ వ్యాపారవేత్త పీటర్ హాగ్ను ప్రేమించి పెళ్లాడింది. అందరూ ఆమె లైఫ్ ఎంతో హ్యాపీగా సాగిపోతోందని అనుకుంటున్న తరుణంలో.. భర్త ఆమెకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సెలీనా జైట్లీ తన విడాకుల వెనుక ఉన్న చేదు నిజాలను పంచుకుంటూ కన్నీరు మున్నీరైంది. ఆమె మాటల్లోనే..."మా 15వ పెళ్లి రోజు నాడు నా భర్త ఏదో మంచి సర్ప్రైజ్ ఇస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూశాను. అతను నన్ను కారులో ఒక పోస్టాఫీస్ దగ్గరకు తీసుకెళ్లి, కొన్ని పేపర్లు నా చేతిలో పెట్టాడు. ఆ పేపర్లు జర్మన్ భాషలో ఉన్నాయి. నాకు జర్మన్ రాకపోవడంతో.. 'ఇందులో ఏముంది?'
అని అడిగాను. దానికి అతను సమాధానం చెప్పకుండా, నన్ను అక్కడే రోడ్డుపై వదిలేసి కారులో వెళ్ళిపోయాడు" అని ఆవేదన వ్యక్తం చేసింది.
"దిక్కుతోచని స్థితిలో నేను ఎలాగోలా ఇంటికి చేరుకున్నాను. ఆ పేపర్లలో ఏముందో తెలుసుకోవడానికి నా పిల్లల చేతికి ఇచ్చి చదవమన్నాను. నా భర్త నాపై చేసిన దారుణమైన, నీచమైన ఆరోపణలను నా కన్నబిడ్డల నోటి నుంచే వినాల్సి వచ్చింది. మొదట ఇదంతా ఏదో ప్రాంక్ లేదా జోక్ అనుకున్నాను.. కానీ అది నిజంగానే విడాకుల నోటీసు అని తెలిసి నా గుండె పగిలింది" అని సెలీనా ఎమోషనల్ అయ్యింది.
విడాకుల నోటీసు ఇవ్వడమే కాకుండా.. భర్త, అతని కుటుంబ సభ్యులు సెలీనాపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించారు. ఆమెను తిరిగి ముంబై వెళ్లనివ్వమని, ఒకవేళ పిల్లలతో ఉండాలనుకుంటే ఆస్ట్రియాలోనే ఉంటూ ఏదో ఒక చిన్న ఉద్యోగం వెతుక్కోవాలని ఆంక్షలు విధించారు.
భర్త వేధింపులు మితిమీరడంతో సెలీనా జైట్లీ కూడా వెనక్కి తగ్గలేదు. తన అత్తింటి వారిపై గృహహింస, వేధింపుల కేసులు పెట్టింది. పిల్లల సంరక్షణతో పాటు భారీ మొత్తంలో భరణం, నష్టపరిహారం డిమాండ్ చేస్తూ న్యాయపోరాటానికి దిగింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన ఆమె జీవితం ఇప్పుడు ఇలా కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం పట్ల నెటిజన్లు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.