
ప్రకాశం జిల్లాలోని మైనింగ్ క్వారీలో జరిగిన ప్రమాదం కేసులో అనుకూల నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో పలువురి ప్రమేయం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ను అరెస్ట్ చేసింది. అతడితో పాటు ప్రైవేట్ మైనింగ్ సంస్థ ప్రతినిధి, కన్సల్టెంట్ను అరెస్ట్ చేశారు. అమరావతి, ఆగస్టు 18: ప్రకాశం జిల్లాలో మైనింగ్ క్వారీలో జరిగిన ప్రమాదం కేసులో అనుకూల నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో పలువురి ప్రమేయం ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గుర్తించింది. ఈ నేపథ్యంలో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే ప్రైవేట్ మైనింగ్ సంస్థ ప్రతినిధి, కన్సల్టెంట్ను అరెస్ట్ చేశారు. వీరిని విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు. గతంలో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్కు రూ. లక్ష లంచం ఇచ్చినట్లు కూడా సీబీఐ గుర్తించింది. అనుకూల నివేదికతో పాటు మైనింగ్ సంస్థ నుంచి త్రైమాసిక లంచాల కోసం రూ. 2 లక్షలు ఏర్పాటు చేసినట్లు కనుగోంది. మైనింగ్ క్వారీ ప్రమాదంలో అనుకూల నివేదిక కోసం రూ. 2 లక్షల నగదు తీసుకుంటూ డిప్యూటీ డైరెక్టర్ను సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ నగదును సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒంగోలు, కడప, హైదరాబాద్లలో నిందితులకు చెందిన ఇళ్లలో కూడా సీబీఐ సోదాలు చేపట్టింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ అధికారులు ఈ సందర్భంగా వివరించారు. ఆలయ ఉద్యోగాల్లో జోనల్ విధానం లేదు.. మెరిట్కే ప్రాధాన్యం: మంత్రి ఆనం రామనారాయణ ఆ మున్సిపాలిటీల విలీన ప్రక్రియ... స్థానిక ఎన్నికల తర్వాతే: సీఎం చంద్రబాబు