© 2026 nimisham.in

ప్రతిష్ఠాత్మక వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షి్పలో తొలిరోజే భారత కుర్రాడు సంచలనం సృష్టించాడు. యువ షట్లర్ ఆయుష్ శెట్టి తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేస్తూ.. ప్రపంచ నెంబర్ వన్... వరల్డ్ నెం.1 షి యుకిపై ఆయుష్ సంచలన విజయం ప్రతిష్ఠాత్మక వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షి్పలో తొలిరోజే భారత కుర్రాడు సంచలనం సృష్టించాడు. యువ షట్లర్ ఆయుష్ శెట్టి తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేస్తూ.. ప్రపంచ నెంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ షి యుకికి షాకిచ్చాడు. మూడు గేమ్ల హోరాహోరీ సమరంలో చైనా స్టార్ను మట్టి కరిపించి గ్రాండ్గా రెండోరౌండ్కు దూసుకెళ్లాడు. ఆదినుంచే జోరు: సొంతగడ్డపై అభిమానుల హర్షధ్వానాలతో విజృంభించిన ఆయుష్.. 30 ఏళ్ల షి యుకితో మ్యాచ్ మొదటి గేమ్లో 11-5 ఆధిక్యంలోకి దూసుకుపోయాడు. అదే ఊపులో గేమ్ను సొంతం చేసుకున్నాడు. అయితే రెండో గేమ్లో పుంజుకున్న షి యుకి..సుదీర్ఘ ర్యాలీలతో ఆయు్షను అలిసిపోయేలా చేసి గేమ్ను దక్కించుకున్నాడు. నిర్ణాయక గేమ్లో.. తెలివిగా ఆడిన ఆయుష్ ప్రత్యర్థి తప్పులను సద్వినియోగం చేసుకొని గేమ్ను మ్యాచ్ను చేజిక్కించుకున్నాడు. తద్వారా తన కెరీర్లో మరో చిరస్మరణీయ విజయం అందుకున్నాడు. కర్ణాటకకు చెందిన ఆయుష్ ఈఏడాది ఆసియా చాంపియన్షి్పలో లీ షి ఫెంగ్, జొనాథన్ క్రిస్టీ, విదిత్సర్న్ వంటి హేమాహేమీలను చిత్తుచేసి రజత పతకం కైవసం చేసుకోవడం విశేషం
.