
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సోదరుడు శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారాయి. వృద్ధాప్యంలో ఉన్న తనకు తమ్ముడి నుంచి ఆర్థిక సహాయం కంటే ఆత్మీయమైన పలకరింపే కావాలని ఆయన చెప్పిన మాటలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాను బ్రహ్మానందం తనను పట్టించుకోవడం లేదని నేరుగా విమర్శించకుండా.. ఒక్కసారి ఫోన్ చేసి “ఎలా ఉన్నావన్నయ్యా?” అని అడిగితే చాలని తన మనసులోని మాటను వెల్లడించారు. తమది ఆరుగురు అన్నదమ్ముల కుటుంబమని శ్రీనివాసరావు తెలిపారు. బ్రహ్మానందం ఐదో సోదరుడని, మిగిలిన నలుగురు ఇప్పటికే కన్నుమూశారని చెప్పారు. ప్రస్తుతం తామిద్దరమే ఉన్నామని పేర్కొంటూ.. వృద్ధాప్యంలో ఒంటరితనం మరింత ఎక్కువగా అనిపిస్తోందని తన ఆవేదనను వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఉండే బ్రహ్మానందం షూటింగ్ల మధ్య ఖాళీ సమయం దొరికినప్పుడు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడితే ఎంతో సంతోషంగా ఉంటుందని అన్నారు. తనకు తమ్ముడిపై ఎలాంటి కోపం లేదని, అతడి నుంచి పెద్దగా ఏమీ ఆశించడం లేదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. “ఎలా ఉన్నావన్నయ్యా? ఏం చేస్తున్నావ్?” అని ఆప్యాయంగా రెండు మాటలు మాట్లాడితే తనకు అదే పెద్ద సంతోషమని చెప్పారు. డబ్బులు, ఇతర సహాయాలు తనకు అవసరం లేదని తెలిపారు. బ్రహ్మానందం తనకంటే ఎంతో పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి కావడంతో తానే వెళ్లి పలకరించడానికి కొంత సంకోచంగా ఉంటుందని శ్రీనివాసరావు చెప్పారు. గొప్పవాళ్లు తమను ఆప్యాయంగా పలకరిస్తే చిన్నవాళ్లకు సంతోషంగా ఉంటుందని, కానీ తామే వారి దగ్గరకు వెళ్లాలంటే ఏదో తెలియని భయం ఉంటుందని వివరించారు. బ్రహ్మానందం తనను ఏమీ అనరని తెలిసినా, తనలో అలాంటి భావన ఉందన్నారు. ఇటీవల బ్రహ్మానందం తమ ఊరికి వచ్చినట్లు తెలిసినా తాను వెళ్లి కలవలేకపోయానని చెప్పారు. తన నడక నెమ్మదిగా ఉంటుందని, అక్కడ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉంటే వారిని దాటుకుని వెళ్లడం తనకు సాధ్యం కాదని వివరించారు. బ్రహ్మానందం తన ఇంటికి రావాలని కూడా తాను కోరుకోవడం