నేను కూడా ఈ ఇంటి వారసురాలినే నాకు డబ్బులు ఇవ్వు అని ఇందుని ఐశ్వర్య అడుగుతుంది. నువ్వు అసలు అని అపర్ణ ఏదో అనబోతంటే ఇందు ఆపుతుంది. డబ్బులు లేవు.. ఆల్రెడీ లెక్కలు చెప్పాను.. కదా.. తాతయ్య ఆపరేషన్ కోసం మాత్రమే డబ్బుంది అని ఇందు అంటుంది. ఆ డబ్బులే ఇవ్వు.. ఇప్పుడు ఆ ముసలోడికి ఆపరేషన్ అవసరమా? చచ్చే వరకు అలానే చెయిర్లో ఉంటాడు.. లేచి పొడిచేది ఏముంది అని ఐశ్వర్య అంటుంది. ఆ మాటలకు ఇందుకి అగ్ని పర్వతం బద్దలైనట్టుగా కోపం వస్తుంది. ఐశ్వర్యను లాగి పెట్టి కొడుతుంది. ఆ సౌండ్కే భ్రమరం భయపడిపోతుంది. ఏం అన్నావ్.. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోను.. నన్ను ఎన్ని అన్నా నేను భరిస్తాను కానీ.. తాతయ్య, నానమ్మని అంటే మాత్రం అసలు ఊరుకోను.. వాళ్లని ముసలివాళ్లు అని అంటావా? ఇంకో ముప్పై ఏళ్లు అయితే నువ్వు కూడా అలానే అవుతావ్ కదా అని తిడుతుంది ఇందు. ముసలివాళ్లు అని అంటున్న వాళ్లే ఒకప్పుడు ఈ దుగ్గిరాల వంశాన్ని నిలబెట్టారు.. వాళ్లే మనకు గతాన్ని ఇచ్చారు.. మన భవిష్యత్తుని తీర్చి దిద్దుతారు.. సీతారామయ్య తాత ఇచ్చిన వారసత్వాన్ని వీళ్లే కొనసాగించారుఐశ్వర్యకు చీవాట్లు.. వాళ్లంటూ ఉన్నారు కాబట్టే.. మనం పుట్టుకతోనే ఓ ఐడెంటెటీతో వచ్చాం.. నీలాగా వాళ్లు కూడా తాగుడు, తిరుగుడు, పబ్స్ అంటూ వెళ్తే మనం ఉండే వాళ్లమే కాదు, ఇంకోసారి వాళ్ల జోలికి వస్తే మాత్రం ఊరుకోను అని తిట్టేసి వెళ్తుంది ఇందు. నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు.. నరం లేని నాలుక ఇలా అనవసరంగా వాగితే ఇలానే ఉంటుంది.. అందుకే నోరు అదుపులో పెట్టుకో అనేది అని నందు కూడా తిడుతుంది. దీంతో ఐశ్వర్యకి ఒళ్లు మండిపోతూ ఉంటుంది. ఇంకో వైపు శేషు పగలబడి నవ్వేస్తుంటాడు.రెచ్చగొట్టిన రేఖ.. ఇలా ఇందు కొడుతుందని నీకు ముందే తెలుసు కదా అమ్మా