
బోనాల పండుగ సందర్భంగా ఇంట్లో నాన్వెజ్ వంటకాలు చేసుకునేవారు చాలామందే ఉంటారు. ప్రతిసారి మటన్ కర్రీ కాకుండా కాస్త వెరైటీగా, స్పైసీగా ఏదైనా చేయాలనుకుంటే మటన్ సుక్కా మంచి ఎంపిక. మటన్ను మసాలాలతో బాగా ఉడికించి, చివర్లో తక్కువ నీటితో డ్రైగా వేయించడం వల్ల ఈ వంటకానికి అద్భుతమైన రుచి వస్తుంది. హోటల్ స్టైల్లో మసాలా ఘుమఘుమలాడే ఈ బోనాలు స్పెషల్ మటన్ సుక్కాను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్ ముందుగా మటన్ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో మటన్ వేసి కొద్దిగా నీరు పోసి మెత్తగా ఉడికించాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేసి కలపాలి. ఇందులో ఉడికించిన మటన్ వేసి మసాలా మొత్తం మటన్కు బాగా పట్టేలా కలపాలి. మీడియం మంటపై నీరు పూర్తిగా ఇగిరిపోయే వరకు వేయించాలి. మటన్ డ్రైగా మారి మసాలా బాగా పట్టిన తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. బోనాలు స్పెషల్ హోటల్ స్టైల్ మటన్ సుక్కా రెడీ. వేడి వేడి అన్నం, రోటీ లేదా రాగి సంగటితో సర్వ్ చేస్తే రుచి మరింత అదిరిపోతుంది! చిట్కా: మటన్ను ముందుగా మెత్తగా ఉడికించి, చివర్లో మసాలాలతో బాగా వేయించడం వల్ల సుక్కా మంచి డ్రై టెక్స్చర్తో, మసాలా రుచితో వస్తుంది