
సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.. రెండు మూడేళ్ల తర్వాత వస్తే ఓకే కానీ ఏకంగా 20-30 ఏళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్స్కు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. హీరోలు ఫామ్లో ఉన్నా లేకపోయినా ఆ పాత సినిమాల బ్రాండ్ ఇమేజ్ వర్కౌట్ అవ్వడంతో బాలీవుడ్ బాక్సాఫీస్ బద్ధలైపోతుంది. తాజాగా మరో ఔట్ డేటెడ్ హీరో సినిమాకు ఇలాగే కాసుల వర్షం కురుస్తుంది. ఒకప్పుడు వరుస హిట్లు కొట్టిన ఇమ్రాన్ హష్మీ.. ఇప్పుడు విలన్గా సెట్టైపోయారు. ప్రేక్షకులు ఈయన్ని హీరోగా ఎప్పుడో మర్చిపోయారు. ఇలాంటి సమయంలో వచ్చిన ఆవారాపన్ 2 బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో.. ఆ బ్రాండ్తో పార్ట్ 2 ఫస్ట్ డే 25 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇమ్రాన్ క్రేజ్ తగ్గినా.. సీక్వెల్ మీద ఉన్న అంచనాలే ఆవారాపన్ 2ను 200 కోట్ల క్లబ్బులో చేర్చేలా కనిపిస్తుంది. దాదాపు 20 ఏళ్లుగా సరైన హిట్ లేక ఫామ్ కోల్పోయిన సన్నీ డియోల్కు గదర్ 2 కళ్లు చెదిరే బ్లాక్బస్టర్ ఇచ్చింది. 25 ఏళ్ళ కింద వచ్చిన గదర్ అప్పట్లో ఇండస్ట్రీ హిట్.. దాని సీక్వెల్ మొన్నొచ్చి మళ్లీ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఏకంగా 600 కోట్లకు పైగా వసూలు చేసింది. సన్నీ డియోల్ క్రేజ్ తగ్గినా కూడా.. గదర్ ఫ్రాంచైజీపై ప్రేక్షకులకున్న విపరీతమైన అభిమానమే ఈ సినిమాకు అన్ని వందల కోట్లు తెచ్చింది. దేశభక్తి సినిమాల్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన బోర్డర్కు సీక్వెల్ 30 ఏళ్ల తర్వాత వచ్చింది.. బోర్డర్ 2కు టాక్ యావరేజ్గానే వచ్చినా.. కలెక్షన్లు అదిరిపోయాయి. ఇప్పుడు సీక్వెల్ ఏంటని పెదవి విరిచిన వాళ్లే ఆశ్చర్యపోయేలా ఈ చిత్రం ఏకంగా 400 కోట్లు రాబట్టి సత్తా చాటింది. దీన్నిబట్టి హీరోల ఫామ్తో సంబంధం లేకుండా.. కేవలం బ్రాండ్ చూసి బాలీవుడ్ ఆడియన్స్ థియేటర్లకు క్యూ