
BJP Announcement new national executive committee : బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. సోమవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో ప్రకటించిన ఈ కొత్త జాబితాలో అనుభవజ్ఞులతోపాటు యువ నాయకులకు పెద్దపీట వేస్తూ, ప్రాంతీయ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత కల్పించారు. అయితే, ఈ జాబితాలో ఏపీకి బీజేపీ నేతలకు చోటు దక్కగా.. తెలంగాణ బీజేపీ నేతలకు అవకాశం కల్పించలేదు. ప్రస్తుతం కొన్ని పదవుల్లో కొనసాగుతున్న వారిని పక్కన పెట్టడం గమనార్హం. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఏపీ బీజేపీ మహిళా నేత, ఎంపీ పురందేశ్వరి, మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె, రామ్ మాధవ్ సహా 13 మంది పేర్లను ప్రకటించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరానీకి అవకాశం కల్పించారు. పార్టీ జాయింట్ కోఆర్డినేటర్గా విష్ణువర్ధన్రెడ్డిని నియమించారు. కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్గా తరుణ్ చుగ్, ఓబీసీ మోర్చా నూతన అధ్యక్షుడిగా అమర్పాల్ మౌర్య పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అదేవిధంగా సంస్థాగత జనరల్ సెక్రటరీగా బీఎల్ సంతోష్, సంస్థాగత జాయింట్ జనరల్ సెక్రటరీగా శివప్రకాష్ పేర్లను ఖరారు చేసింది. ఇదిలాఉంటే.. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు దక్కలేదు. ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణను ఆ పదవి నుంచి తప్పించడం గమనార్హం. అంతేకాక.. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కొనసాగుతున్న లక్ష్మణ్ ను, ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న బండి సంజయ్ లను ఆ పదవుల నుంచి తప్పించారు. ప్రస్తుత నూతన కార్యవర్గంలో తెలంగాణ బీజేపీ నేతలకు ఎవరికీ అవకాశం దక్కలేదు. జాతీయ ఉపాధ్యక్షులు వీరే.. ♦ వసుంధర రాజే సింధియా (రాజస్థాన్), ♦ తీరథ్ సింగ్ రావత్ (ఉత్తరాఖండ్) ♦ రామ్ మాధవ్ (ఢిల్లీ) ♦ బైజయంత్ జయ్ పాండా (ఒడిశా) ♦ దగ్గుబాటి పురంధేశ్వరి (ఆంధ్రప్రదేశ్) ♦ రేఖా వర్మ (ఉత్తరప్రదేశ్) ♦ వర్షాబెన్ నరేంద్రభాయ్ దోషి (గుజరాత్) ♦ డా. భారతి ప్రవీణ్ పవార్ (మహారాష్ట్ర) ♦