బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్లోని ఆరో ఎపిసోడ్లో డేర్ ఆర్ డై అని టాస్కుల్ని పెట్టారు. ఈ టాస్కుల్లో గెలిచిన వారిని టాప్ 15లోకి పంపించారు. అలా నేటి ఎపిసోడ్ ద్వారా నలుగురు కంటెస్టెంట్లు తమ బెర్తుల్ని కన్పామ్ చేసుకున్నారు. అలా నేటి ఎపిసోడ్ ముగిసే సరికి టాప్ 15లోకి ఏడు మంది కంటెస్టెంట్లు ఉన్నారు. హోల్డ్లో ఉన్న 14 మంది నుంచి ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక రేపటి ఎపిసోడ్లో 13 మంది నుంచి టాప్ 15కి ఇంకో 8 మంది కంటస్టెంట్లను సెలెక్ట్ చేస్తారన్న మాట. మరి నేటి ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.షాలిని, అమన్ ఇద్దరూ కూడా మొదటి టాస్క్లో పోటీ పడ్డారు. కుళ్లిన కూరగాయలు అంటూ పెట్టిన ఈ టాస్కులో షాలిని చాలా స్పీడుగా దూసుకుపోయింది. ఈ చివరకు ఈ టాస్కులో షాలిని గెలిచి టాప్ 15లో స్థానం సంపాదించుకుంది. రెండో టాస్కు ప్రారంభం కంటే ముందు బ్రేకప్ స్టోరీలను చెప్పమని అన్నారు. అలా దీపక్, రోహిత్, గాయత్రి ఇలా కొంత మంది తమ తమ బ్రేకప్ స్టోరీలను చెప్పారు. రెండో టాస్కుగా ఎక్స్కి ఫోన్ చేసి మళ్లీ జీవితంలో కలవాలి.. ఐ లవ్యూ చెప్పాలి.. సారీ అని అడగాలి అనే టాస్క్ ఇచ్చారు.ఈ రెండో టాస్క్ కోసం చాలా మంది ముందుకు వచ్చారు. గంటను ముందు పట్టుకున్న వారే టాస్క్ ఆడాల్సి ఉంటుందని ఓ ట్విస్ట్ పెట్టారు. కానీ దీపక్, రోహిత్, గాయత్రి ఇలా అందరూ గంటను పట్టుకుని గెలుస్తారు. కానీ వారి ఫోన్లను అవతలి వ్యక్తులు లిఫ్ట్ చేయరు. దీంతో చివరకు శ్రష్టికి ఈ ఛాన్స్ వస్తుంది. తన మాజీ లవర్కి ఫోన్ చేసి తప్పైందని, సారీ అని, ఐ లవ్యూ అని, నువ్వు లేకపోతే నేను లేను అని మాట్లాడుతుంది. అవతలి వ్యక్తి సరే అని సైలెంట్గా ఉండిపోతాడు