బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్లోని మూడో ఎపిసోడ్లో రాజ కుమారి హైలెట్గా నిలిచారు. ఆమెతో పాటుగా వచ్చిన చాలా మంది కంటెస్టెంట్లు ఎన్నెన్నో కథల్ని చెప్పారు. ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. కానీ రాజ కుమారి కథ మాత్రం అందరినీ కదిలించింది. ఎప్పుడూ స్టేజ్ మీద కంటతడి పెట్టుకోని నవదీప్ కూడా ఏకంగా కన్నీరు పెట్టేసుకున్నాడు. ఆమె కథను విన్న బిందు మాధవి, అభిజిత్ అంతా కూడా హ్యాట్సాఫ్ చెప్పేశారు. ముగ్గురూ గ్రీన్స్ ఇచ్చేసి నేరుగా టాప్ 15లోకి పంపించేశారు. అసలు నేటి ఎపిసోడ్లో వచ్చిన కంటెస్టెంట్లు ఎవరు? హోల్డ్లోకి వచ్చిన వారు ఎవరు? అన్నది ఓసారి చూద్దాం.మొదటగా శ్రష్టి వ్యాకరణం అనే అమ్మాయి వచ్చింది. మోడల్ అని, మిస్ ఇండియా, మిస్ ఏసియా ఇలా చాలా వాటిల్లో పాల్గొని టాప్ 10లో ఉన్నానని చెప్పింది. తనకు నటన, డ్యాన్స్ అంటే ఇష్టమని, కాలేజీలో ఉన్నప్పుడు డ్యాన్స్ చేస్తానని అంటే తన మాజీ ప్రియుడు కొట్టాడని, అప్పుడు చెవికి తీవ్రమైన గాయమైందని తెలిపింది.. ముంబైలో ఉంటున్నాను అని ఇలా తన స్టోరీ చెబుతూ వచ్చింది. నీకు ఎలాంటి అబ్బాయిలు అంటే ఇష్టమని బిందు మాధవి అడిగితే.. వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అని అంటుంది. ఎందుకు అని అంటే.. మార్చుకోవచ్చు కదా అని ఆమె చెబుతుంది. అందరూ ఇలానే అనుకుంటారు అని నవదీప్ నవ్వేస్తాడు.ఇక్కడ ఇలా ఉన్నావ్ కానీ.. లోపల పరిస్థితులు వేరేలా ఉంటాయి.. ఇప్పుడు నేను నీకు రెడ్ ఇస్తాను అని బిందు మాధవి అంటుంది. నువ్వెంతో సాధించావ్.. బెనిఫిట్ ఆఫ్ డౌట్తో.. గ్రీన్ ఇస్తా అంటాడు అభిజిత్. అందర్ క్యా హై.. అది బయటకు రావాలి.చ. క్యూరిసిటీ మాక్కూడా ఉంది.. అని గ్రీన్ ఇస్తాడు నవదీప్. అలా ఆమెని హోల్డోలో పెట్టేశాడు. పంతులు వేషంలో అయ్యప్ప సాదు వస్తాడు. తర్వాత రెమోలా స్టైలీష్గా వస్తాడు. పంతులుకి ఇలాంటి వేషాలు అవసరమా? అని