
సామాన్యుడిని బిగ్ బాస్ హౌస్లోకి పంపించడానికి అగ్నిపరీక్ష2 స్టార్ట్ అయ్యింది. కొంచెం ఫన్, కొంచెం కాంట్రవర్సీతో ఎంతో మంది టాలెంటెడ్ కంటెస్టెంట్స్ తమ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో అగ్నిపరీక్ష సీజన్ 2 చాలా ఘాటుగా నడుస్తోంది. గతంలో కంటే ఈసారి కాస్త డోస్ పెంచారు. జడ్జిలు కూడా పరిస్థితిని చాలా టైట్ చేస్తున్నారు. తాజా ఎపిసోడ్లో కంటెస్టెంట్స్కు జడ్జిలు షాక్ ఇవ్వడంతో పాటు.. ఓ కంటెస్టెంట్ అభిజిత్కు కోలుకోలేని పంచ్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు అపూర్వ. అగ్నిపరీక్ష2లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే తన ఎనర్జీ లెవల్స్తో అందరినీ ఆశ్చర్యపరిచింది అపూర్వ. ఖమ్మంకు చెందిన ఆమె గతంలో యాంకర్గా, మిస్ తెలంగాణగా గెలిచింది. ఖమ్మం కళాకారుల గుమ్మం అంటూ.. తన మాటల దాడితో ఉక్కిరిబిక్కిరి చేసింది. ముఖ్యంగా నవదీప్ మీద ఫోకస్ చేస్తూ.. ఆయన్ను ఇంప్రెస్ చేయాలని చూసింది. బిందు మాధవిని కూడా బుట్టలో వేయాలని చూసిన అపూర్వ.. అభిజిత్పై మాత్రం షాకింగ్ కామెంట్స్ చేసింది. అతను తనకు నచ్చడని.. ఆయన సేఫ్ గేమ్ ఆడాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఫిజికల్ టాస్క్లు ఆడే టైమ్లో ఎడ్యుకేషన్ గురించి చెబుతూ.. తప్పించుకున్నాడని, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయకుండానే మైండ్ గేమ్తో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యాడంటూ మైండ్ బ్లాక్ అయ్యే కామెంట్స్ చేసింది. దాంతో అభిజిత్ కూడా డిఫెన్స్ చేసుకోవడానికి గట్టిగా ట్రై చేశాడు. ఫైనల్గా అపూర్వ ఎంత టాలెంట్ చూపించినా కూడా చివరకు అభిజిత్, బిందు నుంచి రెడ్ కార్డ్ రాగా.. నవదీప్ మాత్రం "ముందు ముందు ఎలా ఉంటావో చూడాలి నువ్వు" అంటూ.. గ్రీన్ కార్డ్ ఇచ్చి హోల్డ్ చేశాడు. అగ్నిపరీక్ష2లో చాలామంది తమ ఒరిజినల్ పర్సనాలిటీని దాచిపెట్టి.. ఏదో చూపించాలి అన్నట్టుగా స్టేజ్ మీదకు వస్తున్నట్టు కనిపిస్తోంది. తాజా ఎపిసోడ్లో ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ లక్ష్మీదీపక్ సేనాపతి కూడా అలానే చేశాడు. తన డిటైల్స్ను చాలా ఎమోషనల్గా చెప్పి