
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాలిటీ షో 'బిగ్బాస్' సరికొత్త హంగులతో పదో సీజన్తో సందడి చేసేందుకు సిద్ధమైంది. కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్గా వ్యవహరించనున్న ఈ సీజన్పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి షో మునుపటి కంటే భిన్నంగా, మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతోందని నిర్వాహకులు చెబుతున్నారు.ఈ సీజన్ గురించి నాగార్జున మాట్లాడుతూ, ఇది నెక్స్ట్ లెవల్లో ఉంటుందని, వెరైటీ, సర్ప్రైజ్లు, డ్రామా, సవాళ్లు పదింతలు అధికంగా ఉంటాయని తెలిపారు. ఈ సీజన్ను 'దశావతారం'గా అభివర్ణించిన ఆయన, ప్రతి వారం బిగ్బాస్ ఒక కొత్త అవతారం ఎత్తుతాడని, ఇది కంటెస్టెంట్లకు ఊహించని మలుపులను ఇస్తుందని అన్నారు. దీనికి తగ్గట్టుగానే “ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్” అనే కొత్త ట్యాగ్లైన్ను విడుదల చేశారు. ఈ ట్యాగ్లైన్ షో స్వరూపాన్నే మార్చేలా ఉందనిపిస్తోంది.ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కొంతమంది సినీ, టీవీ నటీనటులను నేరుగా ఎంపిక చేయగా, సామాన్య ప్రజల కోసం 'అగ్నిపరీక్ష' పేరుతో ప్రత్యేక ఆడిషన్లు నిర్వహిస్తున్నారు. ఈ అగ్నిపరీక్షకు న్యాయనిర్ణేతలుగా బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్లు అయిన నవదీప్, బిందు మాధవి, అభిజీత్లు వ్యవహరిస్తున్నారు. వీరి పర్యవేక్షణలో సామాన్యుల నుంచి తుది జాబితాను ఖరారు చేయనున్నారు.అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని, బిగ్బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందని సమాచారం. సరికొత్త థీమ్, ఆసక్తికరమైన కంటెస్టెంట్లతో ఈ పదో సీజన్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి