© 2026 nimisham.in

బెంగళూరులో దంపతుల మధ్య జరిగిన గొడవ తీవ్ర విషాదానికి దారితీసింది. సివిల్ ఇంజినీర్ సుమంత్ జైన్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ పద్మావతి మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది. ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో దంపతుల మధ్య జరిగిన గొడవ తీవ్ర విషాదానికి దారితీసింది. సివిల్ ఇంజినీర్ సుమంత్ జైన్, సాఫ్ట్వేర్ ఇంజినీర్ పద్మావతి మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో భార్యను చంపేసి, అనంతరం భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది (Bengaluru couple death). పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. సుమంత్, పద్మావతి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. తీవ్ర ఆగ్రహానికి గురైన సుమంత్ తన భార్య తలపై బలంగా కొట్టాడు. అనంతరం దిండుతో ఊపిరాడకుండా చేశాడు. కొంతసేపటి తర్వాత ఆమెను మేల్కొలిపేందుకు ప్రయత్నించాడు. ఆమె స్పందించకపోవడంతో సుమంత్ భయాందోళనకు గురయ్యాడు. భార్య పరిస్థితి గురించి సుమంత్ తన తల్లి ఫోన్కు మెసేజ్ పంపినట్టు పోలీసులు తెలిపారు (Bengaluru techie wife death). సుమంత్ తల్లి వెంటనే ఇంటి యజమానికి సమాచారం అందించారు (Bengaluru domestic dispute). ఇంటిని తెరిచి చూడగా హాల్లోని పైకప్పు ఫ్యాన్కు సుమంత్ ఉరేసుకున్న స్థితిలో కనిపించాడు. అదే ఇంట్లో పద్మావతి కూడా మృతిచెందిన స్థితిలో కనిపించింది. సమాచారం అందుకున్న రాజగోపాల్ నగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ఆధారాలు, ఇతర వివరాల ఆధారంగా ఘటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జాతీయ జెండా సాక్షిగా ఏపీని నంబర్ 1 చేస్తాం