© 2026 nimisham.in

బెల్జియంలో డ్రైనేజీ పనులు చేస్తున్న కార్మికులకు ఊహించని జాక్పాట్ తగిలింది. బ్రస్సెల్స్కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని సింట్-గిలిస్-డెండర్మాండేలో మురుగునీటి పైపులైన్ల స్థానంలో కొత్తవి వేస్తుండగా, వారికి భారీ బంగారు నిధి లభించింది. దీని విలువ సుమారు 9 మిలియన్ యూరోలు (దాదాపు రూ.98 కోట్లు) ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నిధిలో బంగారు నాణేలు, ముద్దలు, నంబర్లు వేసిన బంగారు కడ్డీలు ఉన్నాయి.గత మంగళవారం ఈ నిధిని 18 ఏళ్ల సమ్మర్ వర్కర్ కోబే మొదటిసారి గుర్తించాడు. "మేము తవ్వుతుండగా అక్కడ ఏదో మెరుస్తూ కనిపించింది. మొదట అవి యూరో నాణేలు అనుకున్నాను. కానీ, తీరా చూస్తే ఒక బంగారు కడ్డీ కనిపించింది. మేము అనుకున్న దానికంటే చాలా పెద్ద నిధే దొరికింది. సాధారణంగా ఓ మంగళవారం ఉదయం ఇలాంటిది జరుగుతుందని ఎవరూ ఊహించరు" అని కోబే స్థానిక మీడియాకు తెలిపాడు.ఈ నిధిని ఒక పాత విల్లాలోని సెల్లార్ గోడలో ఇటుకలతో కట్టిన ఒక అరలో బ్యాగులో పెట్టి జాగ్రత్తగా దాచిపెట్టారు. 19వ శతాబ్దం చివరలో బ్రూవరీ యజమాని థియోఫిలస్ వాన్ అషే ఈ భవనాన్ని నిర్మించారు. 1899 నుంచి 1970 వరకు ఇక్కడ బ్రూవరీ నడిచింది. ప్రస్తుతం ఈ భవనాన్ని ఒక సంక్షేమ సంస్థ కార్యాలయాలు, నివాసాల కోసం పునరుద్ధరిస్తోంది.నిధి దొరికిన వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, బంగారాన్ని బ్రస్సెల్స్లోని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం దీని అసలు యజమానులు ఎవరనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ బంగారం