
నందమూరి బాలకృష్ణకు ఇటీవలే మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. డాక్టర్లు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అయినా నిర్మాత మేలు కోరి బాలకృష్ణ త్వరలోనే షూటింగ్ కు సిద్థమౌతున్నారట. పలు విషయాల్లో 'తండ్రికి తగ్గ తనయుడు' అనిపించుకున్న బాలకృష్ణ మరోమారు అదే తీరున సాగనున్నారు. మోకాలు ఆపరేషన్ జరిగినా త్వరలోనే షూటింగ్ కు రెడీ అంటున్నారు. అంతేకాదు సినిమాను అనుకున్న రీతిలో పూర్తి చేయాలనీ ఆశిస్తున్నారు. ఆ విశేషమేంటో చూద్దాం. నటసింహ బాలకృష్ణకు మొదటి నుంచీ వృత్తిపట్ల అంకిత భావం ఎక్కువ. అది తండ్రి యన్టీఆర్ నుండి అబ్బినదే అని అందరికీ తెలుసు. బాలకృష్ణ తన 111వ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన మోకాలికి గాయం తగిలింది. డాక్టర్లు శస్త్ర చికిత్స అవసరం అన్నారు. నీ ఆపరేషన్ చేయించుకున్న బాలయ్యను వైద్యులు రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే బాలయ్య సెప్టెంబర్ నుంచే షూటింగ్ లో పాలుపంచుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్ లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని బాలయ్య ఆశిస్తున్నారు. అలా చిత్రీకరణ పూర్తి కాగానే అక్టోబర్ లో ప్యాచ్ వర్క్, నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేయాలని ప్లాన్. డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను జనం ముందు నిలపాలన్నది బాలయ్య యోచన. అందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీశ్ కిలారు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. బాలకృష్ణకు ప్రమాదాలు కొత్తకాదు. కెరీర్ ఆరంభంలోనే 'బాబాయ్-అబ్బాయ్' షూటింగ్ లో, ఆ తరువాత 'భార్యాభర్తల బంధం' చిత్రీకరణలో వరుసగా గాయాల పాలయ్యారు.అయినా డెడికేషన్ తో అప్పట్లో ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ సాగారు. ఆ పై 'విజయేంద్రవర్మ' షూటింగ్ లో మోకాలుకే గాయమయింది. అప్పట్లో కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. మళ్ళీ మోకాలుకే ప్రమాదం జరగడంతో డాక్టర్స్ రెండు నెలలు