
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్కు చెందిన యువ ప్లేయర్ ఆయుష్ శెట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ప్రపంచ నంబర్ 1, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన చైనా స్టార్ షి యుకీని ఆయుష్ శెట్టి చిత్తు చేశాడు. తొలిసారి వరల్డ్ ఛాంపియన్షిప్లో ఆడుతున్న 21 ఏళ్ల ఆయుష్, 21-14, 13-21, 21-19 తేడాతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గత ఏప్రిల్లో జరిగిన బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్ ఫైనల్లో షి యుకీ చేతిలో ఆయుష్ ఓడిపోయాడు. ఇప్పటివరకు అతడిపై వరుసగా మూడు సార్లు ఓడిపోయిన ఆయుష్, ఈసారి మాత్రం దెబ్బకు దెబ్బ తీశాడు. సొంతగడ్డపై ప్రేక్షకుల సపోర్టుతో ఆయుష్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తర్వాత ఆయుష్ మాట్లాడుతూ.. అభిమానులు ఇచ్చిన ఎనర్జీతోనే తానూ ఈ విజయం సాధించానని, హోమ్ క్రౌడ్ నిరంతరం తనకు సపోర్ట్ చేసిందని చెప్పాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే ఆయుష్ చాలా అగ్రెసివ్గా ఆడాడు. తన పవర్ఫుల్ అటాకింగ్ షాట్లు, నెట్ గేమ్తో షి యుకీపై ఒత్తిడి పెంచి తొలి గేమ్ను 21-14తో సొంతం చేసుకున్నాడు. అయితే రెండో గేమ్లో షి యుకీ పుంజుకున్నాడు. ఆయుష్ చేసిన కొన్ని క్రాస్ కోర్ట్ మిస్టేక్స్ వల్ల యుకీ 21-13తో రెండో గేమ్ను గెలిచి మ్యాచ్ను సమం చేశాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో ఆయుష్ 11-5 తో మంచి ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ ఆ తర్వాత షి యుకీ వేగంగా పాయింట్లు సాధిస్తూ గట్టి పోటీ ఇచ్చాడు. చివరి నిమిషంలో మ్యాచ్ చాలా టెన్షన్ టెన్షన్గా మారింది. "చివర్లో అతడు పాయింట్లు సాధిస్తున్నప్పుడు నిజంగా చాలా నర్వస్గా అనిపించింది. కానీ ఎలాగోలా మ్యాచ్ను ముగించి గెలిచాను. గెలిచాక పెద్ద ఉపశమనం లభించింది" అని ఆయుష్ వెల్లడించాడు. 73 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఆయుష్ 21-19తో