భారత క్రికెట్ చరిత్రలో శ్రీలంక పర్యటనలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా 2000 తర్వాత లంక గడ్డపై ప్రతిష్టాత్మకమైన రెడ్ బాల్ క్రికెట్లో భారత్ తరఫున అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించిన ఆటగాళ్లు నలుగురు మాత్రమే ఉన్నారు. 2010లో అభిమన్యు మిథున్తో పాటు డాషింగ్ ఆల్ రౌండర్ సురేష్ రైనా లంకలోనే తమ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడారు. ఆ తదుపరి 2015లో వికెట్ కీపర్ బ్యాటర్ నమన్ ఓజా, 2017లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా శ్రీలంకలోనే భారత టెస్ట్ క్యాప్ను అందుకున్నారు.ఇప్పుడు 2026లో మరోసారి భారత్, శ్రీలంక వేదికగా టెస్టు సిరీస్ ఆడుతున్న తరుణంలో, ఈ ప్రతిష్టాత్మక జాబితాలోకి మరో నయా ప్లేయర్ వచ్చి చేరే అవకాశం కనిపిస్తోంది. జట్టులో చోటు దక్కించుకున్న యువ ఆటగాళ్లలో ప్రధానంగా ఆకిబ్ నబీ, సారాంశ్ జైన్, గుర్నూర్ బ్రార్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఏ ఒక్కరు గాలేలో జరిగే తొలి టెస్టు మ్యాచ్లో తుది జట్టులోకి వచ్చినా, లంక గడ్డపై టెస్ట్ డెబ్యూ చేసిన ఐదో భారత ఆటగాడిగా నిలుస్తారు.రసవత్తరంగా సాగుతున్న ఈ రేసులో జమ్మూ కశ్మీర్కు చెందిన రైట్ ఆర్మ్ పేసర్ ఆఖిబ్ నబీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన నబీ, రంజీ ట్రోఫీలో అత్యుత్తమ బౌలింగ్తో మెరిశాడు. అదే సమయంలో పంజాబ్ విజిట్ టూర్ నుంచి ఎదిగిన గుర్నూర్ బ్రార్ కూడా లంక-ఏ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లలో ఏకంగా 10 వికెట్ల సాధించి మేనేజ్మెంట్ దృష్టిని ఆకర్షించాడు. ఇక ఆల్ రౌండ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ కూడా తుది బెర్త్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.శ్రీలంక పిచ్లపై స్పిన్తో పాటు లెంగ్త్ బౌలింగ్కు అనుకూలించే పరిస్థితులు ఉండటంతో కెప్టెన్ శుభ్మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ ఏ కాంబినేషన్తో బరిలోకి దిగుతారనేది ఉత్కంఠగా మారింది. ఓవైపు సీనియర్ల అనుభవం, మరోవైపు యంగ్