
తమిళనాడు శాసనసభ సోమవారం ఒక చారిత్రక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించే అధికారిక కార్యక్రమాలను ఇకపై తప్పనిసరిగా రాష్ట్ర గీతమైన 'తమిళ తాయ్ వాళ్తు'తోనే ప్రారంభించాలని ఈ తీర్మానం స్పష్టం చేస్తోంది. ముఖ్యమంత్రి విజయ్ సభలో ఈ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, బీజేపీ సహా సభలోని అన్ని పక్షాలు దీనికి సంపూర్ణ మద్దతు తెలిపాయి. అనంతరం మూజువాణి ఓటింగ్ ద్వారా ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ ప్రకటించారు.ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి విజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది తమిళ అస్తిత్వానికి, భాషా గౌరవానికి దక్కిన చారిత్రక విజయమని ఆయన అభివర్ణించారు. "తమిళం కేవలం ఒక భాష కాదు, అది ఒక ఆలోచన, సంస్కృతి, నాగరికత, జీవన విధానం, చైతన్యం" అని ఆయన పేర్కొన్నారు. 1891లో మనోన్మణియం సుందరనార్ రచించిన 'మనోన్మణియం' నాటకం నుంచి ఈ గీతాన్ని స్వీకరించారు. 1970 నుంచే ప్రభుత్వ కార్యక్రమాల్లో దీనిని ఆలపిస్తున్నప్పటికీ, 2021లో అధికారికంగా రాష్ట్ర గీతంగా గుర్తించారు. ఈ తీర్మానం అమలుకు ఎలాంటి బాహ్య అనుమతులు అవసరం లేదని స్పీకర్ స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో 'వందేమాతరం' గీతాన్ని మొదటగా ఆలపించాలని జూలై 9న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఈ తీర్మానం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో