© 2026 nimisham.in
Pankaj Barman Nepal Flood : ఆగస్టు 26వ తేదీన నేపాల్ దేశాన్ని అతలాకుతలం చేసిన ప్రళయకర ఆకస్మిక వరదల నుంచి అస్సాంకు చెందిన ఒక పవర్ స్టేషన్ ఉద్యోగి అద్భుత రీతిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అస్సాంలోని నల్బారీ జిల్లాకు చెందిన పంకజ్ బర్మన్ అనే యువకుడు.. నేపాల్లోని ఒక జలవిద్యుత్ కేంద్రంలో పనిచేస్తుండగా ఊహించని రీతిలో వరదలు విరుచుకుపడ్డాయి. మృత్యువు అంచుల వరకు వెళ్లి.. కొండపై నాలుగు రోజుల పాటు నరకయాతన అనుభవించిన ఆయన ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుని తన కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈక్రమంలోనే తన భయానక అనుభవాలను పంచుకుంటూ.. నాలుగు రోజుల పాటు కొండపై బిస్కెట్లు మాత్రమే తింటూ గడిపానని వివరించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.పరిగెత్తు పంకజ్ పరిగెత్తు..ఆగస్టు 26వ తేదీన పవర్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో పాటు బురద, పెద్ద పెద్ద రాళ్లతో కూడిన వరద నీరు కేంద్రంలోకి దూసుకొచ్చింది. ఆ సమయంలో తోటి ఉద్యోగి ఒకరు "పరుగెత్తు పంకజ్.. పరుగెత్తు!" అని గట్టిగా కేకలు వేయడంతో తాను తక్షణమే బయటకు పరుగులు తీసినట్లు పంకజ్ గుర్తు చేసుకున్నారు. వరద ఉధృతికి రోడ్లు, వాహనాలు, నిర్మాణాలు కళ్ల ముందే కొట్టుకుపోవడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి ఎత్తైన ప్రాంతమే శరణ్యమని భావించి.. సమీపంలో ఉన్న ఓ కొండ పైకి పరుగు తీసినట్లు పేర్కొన్నారు.ఇదీ చూడండి: నేపాల్ రెస్క్యూ మిరాకిల్.. మూడ్రోజులు మట్టి దిబ్బల కింద నలిగినా సజీవంగా బయటపడ్డ ఆరేళ్ల చిన్నారి!మంచినీళ్లు, బిస్కెట్లతో 4 రోజుల నరకయాతనసుమారు వంద మందికి పైగా బాధితులు ఆ కొండపైన చిక్కుకుపోయినట్లు వివరించారు. వరద తగ్గుముఖం పట్టే వరకు ఏమీ తినడానికి లేక, కేవలం బిస్కెట్లు, మంచి నీళ్లతోనే నాలుగు రోజుల పాటు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడిపామన్నారు. నీటి ఉధృతి కాస్త తగ్గిన తర్వాత నేపాల్ రెస్క్యూ బృందాలు తమను సురక్షితంగా ఖాఠ్మాండులోని ఒక హోటల్కు తరలించాయని
వెల్లడించారు. అయితే తాను కూడా అక్కడే ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుసుకున్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.. తతో ఫోన్లో మాట్లాడి, క్షేమంగా స్వగ్రామానికి తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేశారని స్పష్టం చేశారు. ఈక్రమంలోనే సీఎం అందించిన సహాయానికి పంకజ్ బర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.ఇదీ చూడండి: నేపాల్ వరదల్లో కన్నీళ్లు పెట్టించే ఘటన.. ఇళ్లంతా నేలమట్టమైనా, యజమాని కోసం అక్కడే కూర్చుని శునకం నిరీక్షణతిరిగొచ్చినా వీడని ఆవేదన..!తాను ప్రాణాలతో తిరిగొచ్చినప్పటికీ.. తనతో పాటు పనిచేసే ప్రాణ స్నేహితుడు అరుణ్ మహంతా ఆచూకీ ఇంకా లభించకపోవడం పంకజ్ను తీవ్రంగా కలిచివేస్తోంది. ప్రమాదం జరిగిన రోజు ఉదయం 5 గంటలకు నైట్ డ్యూటీ ముగించుకుని వచ్చిన అరుణ్.. కాసేపు పడుకుని మళ్లీ ఫోన్ చేస్తానని ఇంట్లో చెప్పాడని, తనతో కలసి అల్పాహారం చేశాక తాను డ్యూటీకి వెళ్లానని పంకజ్ తెలిపారు. ఆ తర్వాత అతడి ఫోన్ కలవలేదని, తమ బృందంలో ఎనిమిది మంది సురక్షితంగా తిరిగొచ్చినా మరో ఐదుగురు ఇంకా కనిపించకుండా పోయారని పంకజ్ కంటతడి పెట్టారు