© 2026 nimisham.in

జీవితాంతం కలిసి ఉంటాం.. కలిసి నడుస్తాం అనే కారణంతో పెళ్లి అనే బంధంలోకి అడుగుపెడతాం. అందుకే.. ప్రతి విషయంలోనూ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నడవాలి. ఏ కారణంతోనూ ఒకరి చెయ్యి మరొకరు వదిలిపెట్టకూడదు. ముఖ్యంగా పెళ్లైన స్త్రీలు భర్త పక్కన లేనప్పుడు నాలుగు ప్రదేశాలకు వెళ్లకూడదని చాణక్యుడు చెబుతున్నాడు. చాణక్యుడు అలా ఎందుకు చెప్పాడు? చాణక్యనీతిలో అసలు ఏముంది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. చాణక్యుని ప్రకారం, మహిళలు ఏదైనా తెలియని ప్రదేశానికి, నిర్జల ప్రదేశానికి.. ముఖ్యంగా తగినంత భద్రతా ఏర్పాట్లు లేని ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లకూడదు. ఇలాంటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం వల్ల ప్రమాదాలు రావచ్చు. కాబట్టి.. భర్త లేదా కుటుంబ సభ్యులు వెంట పెట్టుకొని మాత్రమే వెళ్లాలి. ఈ రోజుల్లో మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. కానీ.. భద్రత లేని ప్రదేశాలకు మహిళలు ఒంటరిగా దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదని చాణక్యుడు చెబుతున్నాడు. భద్రత పరిమాణాలు చెక్ చేసుకున్న తర్వాతే వెళ్లాలి… గొడవలు, వివాదాలు లేదా ఉద్రిక్త వాతావరణం ఉన్న ప్రదేశాలకు కూడా భర్త లేకుండా మహిళలు ఒంటరిగా వెళ్లకూడదు. అటువంటి ప్రదేశాల్లో ఎటు నుంచి ప్రమాదం ముంచుకు వస్తుందో చెప్పలేం. అందుకే.. భార్యాభర్తలు ఒకరికొకరు అండగా ఉంటూ, కష్ట సమయాలను కలిసి ఎదుర్కోవాలి అని చాణక్యుడు చెప్పాడు. ఆచార్య చాణక్యుని ప్రకారం, మహిళలు ఎల్లప్పుడూ చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. ఒక ప్రదేశంలో అసభ్య ప్రవర్తన గల వ్యక్తులు నివసిస్తుంటే, వారు దానికి దూరంగా ఉండాలి. ఇది ఒక వ్యక్తి ప్రతిష్ఠ , భద్రత రెండింటినీ ప్రభావితం చేస్తుంది. అందువల్ల, మహిళలు అటువంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలి
.