
భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత కొనసాగడం అత్యంత కీలకమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సరిహద్దు పరిస్థితులు ఇరుదేశాల మధ్య ఉన్న విస్తృత ద్వైపాక్షిక సంబంధాలపై నేరుగా ప్రభావం చూపుతాయని ఆ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తేల్చి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్: అప్పర్ సుబన్సిరి జిల్లాలో చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించారంటూ వచ్చిన వార్తలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను కాపాడటమే భారత్కు అత్యంత ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు. సరిహద్దు పరిస్థితులు ఇరుదేశాల మధ్య ఉన్న విస్తృత ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని తేల్చి చెప్పారు. చైనా సరిహద్దు వ్యవహారాలపై ఇరు దేశాల మధ్య ఇటీవల జరిగిన చర్చల్లోనూ ఇదే విషయాన్ని భారత్ పదేపదే స్పష్టం చేసిందన్నారు. ఈ ఏడాది ఆగస్టు 6న జరిగిన 36వ WMCC సమావేశంలో వాస్తవాధీన రేఖ(LAC) వెంట పరిస్థితిని ఇరు దేశాలు సమీక్షించాయన్నారు. ఈ సమావేశంలో సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొనడం ద్వైపాక్షిక సంబంధాల సమగ్రాభివృద్ధికి అవసరమని భారత వైపు నుంచి మరోసారి స్పష్టం చేసినట్లు జైస్వాల్ పేర్కొన్నారు. అదేవిధంగా ఎల్ఏసీ వెంట అపార్థాలు, తప్పుడు అంచనాలకు తావులేకుండా ఇప్పటికే ఉన్న దౌత్య, సైనిక కమ్యూనికేషన్ వ్యవస్థలను కొనసాగించాలని ఇరుదేశాలు అంగీకరించాయని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లోని తక్సింగ్ ప్రాంతంలో ఉన్న పుకార్ లా, ఒల్లో సమీపంలో చైనా సైనికులు ఎల్ఏసీ దాటి వచ్చినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలను అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ గత వారం ఖండించారు. సరిహద్దును భారత సైన్యం సమర్థవంతంగా కాపాడుతోందని, భారత భూభాగ భద్రత విషయంలో ఎలాంటి సమస్య లేదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. అరుణాచల్ ప్రదేశ్లోని 27 ప్రాంతాలు, భౌగోళిక ప్రదేశాలకు భారత్ ఇటీవల అధికారికంగా ప్రామాణిక పేర్లను ప్రకటించింది. చైనా ఈ చర్యను వ్యతిరేకిస్తూ