తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను వైఎస్సార్సీపీ ఎంపీ కలిశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకుఎంపీ డాక్టర్ గుమ్మా తనూజ రాణి, తన భర్త వినయ్తో కలిసి చెన్నైలోని సచివాలయంలో విజయ్తో సమావేశం అయ్యారు. పార్లమెంటరీ స్టడీ టూర్ కోసం ఎంపీ తనూజ రాణి చెన్నైకి వెళ్లారు.. ఈ సందర్భంగా సీఎం విజయ్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తమిళనాడు సీఎంను కలవడం ఆనందంగా ఉందంటూ ఫోటో, వీడియోను పోస్ట్ చేశారు.ఎంపీలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో స్టడీ టూర్ కోసం చెన్నై వెళ్లారు. CMDA (చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ), తమిళనాడు అర్బన్ హ్యాబిటాట్ డెవలప్మెంట్ బోర్డు, CMRL (చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్), గ్రేటర్ చెన్నై కార్పొరేషన్, కమిషనరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్, CMWSSB (చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు) సంస్థల ఉన్నతాధికారులతో పట్టణాభివృద్ధి, మౌలిక వసతులపై చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో పట్టణ ప్రణాళికను మరింత బలోపేతం చేయడం, ప్రజా మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, గృహ నిర్మాణం, రవాణా సౌకర్యాలు, నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ వ్యవస్థలను మెరుగుపరచడం, స్థిరమైన అభివృద్ధిని సాధించడం వంటి అంశాలపై చర్చించారు. ఈ కమిటీలో మరికొందరు ఎంపీలు కూడా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను కలిశారు.2024 ఎన్నికల్లో తనూజ రాణి అరకు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించి లోక్సభలో అడుగుపెట్టారు. తనూజ అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ కోడలు. పాల్గుణ 2019 ఎన్నికల్లో అరకు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు 2024 ఎన్నికల్లో సీటు దక్కలేదు.. ఆయన స్థానంలో రేగ మత్స్యలింగంకు టికెట్ కేటాయించారు. అయితే పాల్గుణ కోడలు తనూజకు అరకు ఎంపీగా అవకాశం ఇచ్చారు. తనూజ రాణి డాక్టర్ కాగా.. మాజీ ఎమ్మెల్యే పాల్గుణ