
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన డిజిటల్ చెల్లింపుల సేవ 'యాపిల్ పే'ను భారత్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ నాటికి ఈ సేవలను ప్రారంభించే దిశగా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అయితే, ప్రారంభ దశలో ఈ ప్లాట్ఫామ్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలకు సపోర్ట్ లభించే అవకాశం లేదని తెలుస్తోంది.తొలి దశలో యాపిల్ వాలెట్ యాప్లో వీసా, మాస్టర్కార్డ్ నెట్వర్క్లకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులను అనుసంధానించుకునే వెసులుబాటును కల్పించనున్నారు. దీని ద్వారా వినియోగదారులు తమ ఐఫోన్లు లేదా యాపిల్ వాచ్లను నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్ సదుపాయం ఉన్న పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్స్ వద్ద ట్యాప్ చేయడం ద్వారా కాంటాక్ట్లెస్ చెల్లింపులు చేయవచ్చు. ఈ సేవల కోసం హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి ప్రధాన బ్యాంకులతో యాపిల్ ఇప్పటికే చర్చలు జరిపింది.అయితే, యూపీఐ అనుసంధాన ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్లో యూపీఐ సేవలను ప్రారంభించాలంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నుంచి అనుమతులు పొందడం తప్పనిసరి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ విధానంపై యాపిల్, ఎన్పీసీఐ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. యాపిల్ తన సొంత డివైజ్-లెవల్ సెక్యూరిటీకి ప్రాధాన్యతనిస్తుండగా, ఎన్పీసీఐ మాత్రం 'ఆధార్' ఆధారిత ప్రామాణీకరణ ఉండాలని స్పష్టం చేస్తోంది.దీనికి తోడు, లావాదేవీల రుసుము విషయంలోనూ బ్యాంకులతో చర్చలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతి లావాదేవీపై 0.15 శాతం నుండి 0.20 శాతం వరకు వసూలు చేసే యాపిల్, భారత్ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఆ వాటాను 0.10 శాతానికి తగ్గించాలని బ్యాంకులు