మెడికో ప్రియాంక కేసు ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాజమండ్రిలో మద్యం మత్తులో ఇద్దరు నిందితులు ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రియాంక మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రియాంక మృతిపై స్పందించారు.మృత్యువుతో పోరాడుతూ ప్రియాంక మరణించడం అత్యంత విషాదకరమని షర్మిల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రియాంక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు."తాగుబోతు పైశాచికత్వానికి నిదర్శనం ఈ ఘటన. ఇది ప్రమాదం కాదు.. నిందితుడి అత్యంత క్రూరమైన చర్య. ఎంతో సుదీర్ఘమైన, అద్భుతమైన భవిష్యత్తు ఉన్న మెడికో ప్రియాంక జీవితం మానవమృగం రాక్షస చక్రాలకింద నలిగి ముగిసిపోవడం తీవ్రంగా కలిచివేసే విషయం. కళ్లముందే ఘోరం జరిగినా కూటమి ప్రభుత్వం మాకేం సంబంధం అన్నట్లు వ్యహరించడం సిగ్గుచేటు. హంతకుడిని కాపాడేలా ప్రభుత్వ తీరు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. తాగుబోతు నిర్వాకానికి ఆడబిడ్డ బలైతే.. మూడు రోజుల పాటు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం ఎంతవరకు న్యాయం?" అని షర్మిల ప్రశ్నించారు.ప్రియాంక కేసును హత్య కేసుగా నమోదు చేయకుండా వారం రోజులు ఎదురు చూడటం ఎక్కడి ధర్మమని షర్మిల నిలదీశారు. కళ్లముందే సాక్ష్యాలు కనపడుతుంటే చిన్న కేసుగా చుట్టేయాలని చూడటమా మీరు చేసే న్యాయమంటూ ఏపీ ప్రభుత్వాన్ని షర్మిల ప్రశ్నించారు. 20 లక్షలు పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోవాలని చూడటమా ఆడబిడ్డలకు ఇచ్చే భరోసా అంటూ విమర్శించారు. గడచిన కొన్ని నెలలుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణ స్థితికి చేరుకున్నాయన్న షర్మిల.. రాష్ట్ర నలుమూలల ఆడబిడ్డలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.మెడికో ప్రియాంక హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడాలని.. ఫాస్ట్రాక్ట్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని