
ఏపీలో స్వయం సహాయక సంఘాలకు కూటమి సర్కార్ (AP Govt) ఇవాళ మరో శుభవార్త చెప్పింది. డ్వాక్రా సంఘాలకు ప్రయోజనాలు కల్పించేందుకు వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఇదే కోవలో ఇవాళ వారికి భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ డ్వాక్రా సంఘాలకు ఉన్న 10 మంది సభ్యుల నిబంధన నుంచి వెసులుబాటు కల్పించింది. ఇకపై 8 మంది ఉన్నా సరే వారికి రుణాలతో పాటు ఇతర ప్రయోజనాలు కల్పించబోతోంది
.





