మహిళా సాధికారత కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో ముఖ్మమైన ఆలోచన చేస్తోంది. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలకు మహిళా డ్రైవర్లను నియమించే ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ఏరియా ఆస్పత్రి వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో నూతన102 అంబులెన్సు సర్వీసులను (తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్) మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 300 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సత్యకుమార్ యాదవ్.. మరో రెండు నెలల్లో 200 కొత్త వాహనాల్ని సిద్దం చేస్తామని వెల్లడించారు. మహిళలకు ఉద్యోగావకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు గానూ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలకు మహిళా డ్రైవర్లను నియమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. మహిళలు అన్ని రంగాల్లో సమర్థవంతంగా సేవలు అందిస్తున్నారని.. డ్రైవింగ్ కూడా వారికి సాధ్యమేనని మంత్రి వివరించారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల నిర్వహణ సంస్థ అయిన కన్సార్టియం ఆఫ్ విద్యా వేదా ఫౌండేషన్ అండ్ శ్రీనివాసా టూర్స్ అండ్ ట్రావెల్స్.. మహిళా డ్రైవర్ల నియామకానికి ప్రతిపాదన చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సానుకూలంగా ఉందని వివరించారు.మరోవైపు గర్భధారణ నుంచి ప్రసవం వరకు 102 వాహనాలు, అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనాలు, గ్రామస్థాయిలో పరీక్షలు, చికిత్సల కోసం 104 వాహనాల సేవలను అనుసంధానిస్తూ.. సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రజలు అనారోగ్యానికి గురైతే ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. వారివద్దకే సేవలు తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహన సేవలను ప్రసవం తర్వాత.. ఆసుపత్రి నుంచి ఇంటికి చేర్చడానికి మాత్రమే పరిమితం చేయకుండా.. గర్భధారణ దశ నుంచే సేవలు అందించేలా విస్తరిస్తున్నట్లు తెలిపారు. యాంటీనాటల్ చెకప్ల