
మెగా డీఎస్సీపై ప్రతి ఆరోపణకూ వివరణ ఇచ్చినా.. వైసీపీ వాళ్లు రోజుకో కుట్ర చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. 80, 90 ఏళ్లవారిని కూడా నిరుద్యోగులుగా చూపించి ధర్నాలు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. 80, 90 ఏళ్లవారినీ నిరుద్యోగులుగా చూపి ధర్నాలు చేయిస్తున్నారు మెగా టీచర్లు రోడ్లెక్కడం భేష్.. వారికి అండగా ఉంటాం మెరిట్ ఆధారంగానే వారికి ఉద్యోగాలు.. ఎంపికంతా ఆన్లైన్లోనే రెండున్నరేళ్లుగా సభకు రాని ఏకైక పార్టీ.. మళ్లీ జీతాలు తీసుకుంటారు బాధ్యత ఉంటే సభకు వచ్చి మాట్లాడాలి.. అసెంబ్లీలో సీఎం ధ్వజం అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీపై ప్రతి ఆరోపణకూ వివరణ ఇచ్చినా.. వైసీపీ వాళ్లు రోజుకో కుట్ర చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. 80, 90 ఏళ్లవారిని కూడా నిరుద్యోగులుగా చూపించి ధర్నాలు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీ అంశంపై సోమవారం శాసనసభలో ఆయన మాట్లాడారు. ‘ఉద్యోగాలకు ఎంపిక కానివారు కూడా పారదర్శకంగా భర్తీ జరిగిందని చెబుతున్నారు. ఉద్యోగాలు సాధించినవారు రోడ్లెక్కి ర్యాలీలు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం. వైసీపీకి వారే సరైన సమాధానం చెబుతున్నారు. అయినా ఆ పార్టీ మారదు. రెండున్నరేళ్లు అసెంబ్లీకి రాని పార్టీని చూడడం నా జీవితంలో ఇదే తొలిసారి. అయినా జీతాలు, ప్రివిలేజెస్ పొందుతున్నారు. ప్రజలపై బాధ్యత ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి’ అని హితవు పలికారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో ఒక్క టీచర్ నియామకం కూడా చేపట్టలేదన్నారు. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేసి 15,941 ఉద్యోగాలు భర్తీచేశామని.. 148 రోజుల్లోనే పారదర్శకంగా ప్రక్రియ పూర్తిచేశామని గుర్తుచేశారు. ‘వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లను కట్టుదిట్టంగా అమలుచేశాం. మెరిట్ ఆధారంగా అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. క్రీడా కోటా పోస్టుల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలనే ఇక్కడా అమలుచేశారు. మెగా డీఎస్సీలో ఉద్యోగాలు వచ్చినవారు అత్యుత్తమ ప్రతిభావంతులు. ఎంపిక ప్రక్రియంతా ఆన్లైన్లోనే జరిగింది. ఇంతకంటే పారదర్శకత