
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 'దిమాగీ నక్సల్' (మేధో నక్సల్) వ్యాఖ్యలపై ప్రముఖ సినీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తీవ్రంగా స్పందించారు. యువతపై రాజకీయ ముద్రలు వేయడం కన్నా, వారికి విద్యాబుద్ధులు నేర్పడం, విమర్శనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం, అవసరమైతే థెరపీ ద్వారా వారిని అర్థం చేసుకోవడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.సోషల్ మీడియా వేదికగా ప్రధాని వ్యాఖ్యలపై అనురాగ్ కశ్యప్ స్పందిస్తూ, నేటి రాజకీయ భాష యువతరం ఆందోళనలను, వారి ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందా అని ప్రశ్నించారు. "ఈ పెద్దవాళ్లకు ఇప్పటి పిల్లలు అస్సలు అర్థం కారు. 'దిమాగీ నక్సల్' అనగానే ఏదో బ్రహ్మాస్త్రం ప్రయోగించామని అనుకుంటున్నారు. అంకుల్.. ఇప్పటి పిల్లలకు నక్సల్ అంటే ఏంటో కూడా తెలియదు. ముందుగా పుస్తకాల్లోంచి తొలగించిన పాఠ్యాంశాలను మళ్లీ చేర్చండి. కానీ దాని కోసం స్కూళ్లను బాగుచేయాలి, టీచర్లను నియమించాలి" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.అంతటితో ఆగకుండా, నేటి తరాన్ని అర్థం చేసుకోవడానికి పాలకులకు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. "నా సలహా ఏంటంటే.. కాస్త థెరపీ తీసుకోండి. అది చాలా అవసరం. ఆ తర్వాత వాళ్లని ప్రభావితం చేయాలంటే జెన్-జెడ్ (Gen Z) భాష కూడా నేర్చుకోవాలి. దాని కోసం మీరు కూడా చదువుకోవాలి" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఆ తర్వాత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మరోసారి విమర్శలు గుప్పించారు. ఈసారి ఆన్లైన్ ట్రోల్స్ను ఉద్దేశించి.. "ఈసారి నా పోస్టుపై వెయ్యి మందికి