
యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆమె తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. అది బాధ అయినా, సంతోషం అయినా. అంతేకాదు సమాజానికి సంబంధించిన అంశం అయినా.. నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెబుతుంటుంది. అభ్యంతరకరంగా ఉంటే స్టార్ హీరోల సినిమాలను కూడా విమర్శిస్తుంటుంది. విజయ్ దేవరకొండ `అర్జున్ రెడ్డి` సినిమాపై విమర్శలు చేసింది. ఆ మధ్య మహిళల డ్రెస్ గురించి కామెంట్ చేసిన శివాజీని ఆడుకుంది. ఇలా చాలా విషయాల్లో ఆమె రియాక్ట్ అవుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ ప్రాసెస్లో చాలా సార్లు ఆమె ఉద్దేశ్యం రాంగ్గా పోట్రే అవుతుంది. జనాలకు తప్పుగా రీచ్ అవుతుంటుంది. దీంతో ట్రోల్ చేస్తుంటారు. సాధారణంగా అనసూయ ఏం రియాక్ట్ అయినా సరే నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. ఇలా ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడితే మాత్రం కచ్చితంగా రచ్చ చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. లేటెస్ట్ గా అనసూయ కొత్త వివాదంలో ఇరుక్కుంది. ఇటీవల ఆమె సనాతన ధర్మం, జై శ్రీరామ్ అనే నినాదాన్ని అడ్డు పెట్టుకొని కొందరు అసాంఘిక కార్యకలాపాలకు, దాడులకు పాల్పడుతున్నారంటూ కామెంట్ చేసింది. దీంతో హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆమెని వ్యతిరేకించారు. ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అంతేకాదు అనసూయపై హైదరాబాద్ బోరబండలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనసూయ వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు బీజేపీ నేతలు. సోషల్ మీడియాలో మాట్లాడే సమయంలో ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని ఆమెకి వార్నింగ్ ఇచ్చారు. దీనికి అనసూయ స్పందించింది. ఒక నోట్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. `నా మాటలను కొంత మంది కావాలనే తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారని, పూర్తిగా డిఫరెంట్ వేలో క్రియేట్ చేస్తున్నారని, అందుకే ఈ క్లారిఫికేసన్ ఇవ్వాల్సి వస్తోందని చెప్పి నోట్ ని షేర్ చేసింది. `నేను మాట్లాడింది ఒక పర్టిక్యూలర్ సెట్ ఆఫ్