© 2026 nimisham.in

పార్లమెంట్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షానికి కీలక ప్రతిపాదన చేశారు. ఏ ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు సభలోనే ఉంటానని చెప్పారు. ఈ 24 గంటల్లో ప్రతిపక్షం లేవనెత్తే అంశాలపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.నీట్ విద్యార్థుల ఆందోళనలపై జరిగిన పోలీసు చర్యకు సంబంధించి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగంపై కూడా చర్చ కోరుతోంది. ఈ డిమాండ్లతో పార్లమెంట్లో కార్యకలాపాలు స్తంభించాయి.చర్చకు సిద్ధంగా ఉంటే అధికారికంగా లేఖ ఇవ్వాలని అమిత్ షా ప్రతిపక్షాన్ని కోరారు. “లేఖ రాసి ఇవ్వండి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి చర్చిద్దాం. రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను” అని చెప్పారు.ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని అమిత్ షా స్పష్టం చేశారు. చర్చ జరగాలా? సభను కొనసాగకుండా అడ్డుకోవాలా? అన్నది ఇప్పుడు ప్రతిపక్షమే నిర్ణయించుకోవాలని అన్నారు.పార్లమెంట్కు తాను రావడం లేదంటూ ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను కూడా షా ఖండించారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తాను క్రమం తప్పకుండా సభకు హాజరవుతున్నానని చెప్పారు.పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నది ప్రతిపక్షమేనని అమిత్ షా ఆరోపించారు. సభకు వచ్చి పదేపదే కార్యకలాపాలను అడ్డుకుంటే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు.నీట్ ఆందోళనలపై చర్చకు ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల