
భారతదేశంలో గంగా, యమునా, గోదావరి, కృష్ణా, కావేరి, నర్మదా, తపతి.. ఇలా ఎన్నో నదులు ఉన్నాయి. నదుల పేర్లన్నీ స్త్రీల పేర్లుగానే ఉంటాయి. అయితే భారతదేశంలో ఒక నది మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అదే బ్రహ్మపుత్ర నది. పేరు చూస్తేనే ఇది ప్రత్యేకంగా అనిపిస్తుంది. ‘బ్రహ్మపుత్ర’ అంటే ‘బ్రహ్మ దేవుడి కుమారుడు’ అని అర్థం. అందుకే బ్రహ్మపుత్రను భారతదేశంలోని ఒకే ఒక్క ‘మగ నది’గా చాలామంది చెబుతుంటారు. నిజానికి ఇది కేవలం పేరు విషయంలోనే కాదు.. తన ప్రవాహం, స్వభావం విషయంలోనూ ప్రత్యేకత ఉంటుంది. టిబెట్లో పుట్టిన ఈ నది భారత్లోకి అరుణాచల్ప్రదేశ్ మీదుగా ప్రవేశిస్తుంది. అక్కడ దీనిని ‘సియాంగ్’ అని పిలుస్తారు. ఆ తర్వాత అసోంలోకి చేరినప్పుడు బ్రహ్మపుత్రగా మారుతుంది. చివరికి బంగ్లాదేశ్లోకి వెళ్లి గంగానదితో కలిసి సముద్రంలో కలుస్తుంది. బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన కథలు భారతీయ పురాణాల్లో కూడా కనిపిస్తాయి. పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడి కుమారుడిగా ఈ నదిని భావిస్తారు. అందుకే దీనికి ‘బ్రహ్మపుత్ర’ అనే పేరు వచ్చింది. సంస్కృతంలో ‘పుత్ర’ అంటే కుమారుడు. ఈ కారణంగానే ఇతర ప్రధాన నదులతో పోలిస్తే బ్రహ్మపుత్ర పేరు ప్రత్యేకంగా కనిపిస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బ్రహ్మపుత్ర నదిని భారత్లో మాత్రమే కాకుండా టిబెట్, చైనా, బంగ్లాదేశ్లో కూడా వేర్వేరు పేర్లతో పిలుస్తారు. టిబెట్లో దీనిని ‘యార్లుంగ్ సాంగ్పో’ అని అంటారు. భారత్లోకి వచ్చిన తర్వాత ‘సియాంగ్’, ‘దిహాంగ్’ వంటి పేర్లు వినిపిస్తాయి. అసోంలోకి వచ్చిన తర్వాతే ఇది బ్రహ్మపుత్రగా ప్రసిద్ధి చెందింది. ఈ నది కేవలం పేరుతోనే ప్రత్యేకం కాదు. భారీ నీటి ప్రవాహం, పొడవైన ప్రయాణం, వర్షాకాలంలో వచ్చే వరదల కారణంగా కూడా ఇది ప్రపంచంలోని ముఖ్యమైన నదుల్లో ఒకటిగా నిలిచింది. బ్రహ్మపుత్ర నది ఈశాన్య భారతదేశానికి ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా అసోం రాష్ట్రంలోని ప్రజల జీవితం ఈ నదితోనే ముడిపడి ఉంది. వ్యవసాయం, చేపల