© 2026 nimisham.in

అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హతమైన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు టెహ్రాన్లో కొనసాగుతున్నాయి. ఆదివారం లక్షలాది మంది ప్రజలు టెహ్రాన్ వీధుల్లోకి, గ్రాండ్ మొసల్లా కాంప్లెక్స్లోకి తరలివచ్చి తమ ప్రియతమ నేతకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా "డెత్ టు అమెరికా", "డెత్ టు ఇజ్రాయెల్" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు.జులై 4న ప్రారంభమైన ఈ అంత్యక్రియల కార్యక్రమాలు ఆరు రోజుల పాటు కొనసాగి, జులై 9న మషద్లో ఖననంతో ముగుస్తాయి. టెహ్రాన్లో జరిగిన ప్రార్థనల్లో ఖమేనీ ముగ్గురు కుమారులు మోస్తఫా, మీసమ్, మసౌద్తో పాటు ఉన్నతాధికారులు, సైనిక ప్రముఖులు పాల్గొన్నారు. తండ్రి శవపేటికను చూసి కుమారులు కన్నీటిపర్యంతమయ్యారు. 36 ఏళ్లు ఇరాన్ను పాలించిన ఖమేనీ, ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్ యుద్ధంలో జరిగిన తొలి దాడుల్లో తన కుటుంబ సభ్యులతో సహా హతమయ్యారు. యుద్ధం కారణంగా మార్చిలో జరగాల్సిన ఈ కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం అమలవుతున్న కాల్పుల విరమణ నేపథ్యంలో వీటిని తిరిగి ప్రారంభించారు.అయితే, ఖమేనీ రెండో కుమారుడు, ఆయన తర్వాత ఇరాన్ మూడో సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ ఈ కార్యక్రమాలకు హాజరుకాలేదు. ఫిబ్రవరిలో జరిగిన దాడుల్లో ఆయన గాయపడినట్లు, భద్రతా కారణాల దృష్ట్యా ఆయన బయటకు రావడం లేదని తెలుస్తోంది. ఇజ్రాయెల్ మళ్లీ దాడి చేయవచ్చనే ఆందోళనల నడుమ ఆయన కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు.ఈ అంత్యక్రియలు ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన కొనసాగింపును, ఐక్యతను చాటే