© 2026 nimisham.in
రవితేజ , శివ నిర్వాణ కాంబినేషన్లో రూపొందిన డివోషనల్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి’ ఆగస్టు 21న గ్రాండ్గా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ చేసిన ప్రసంగం సభను ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తడమే కాకుండా, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫ్లోలో ఆయన రవితేజ వ్యక్తిగత ఆస్తులు, ఆయనకున్న ఫిలాసఫీ గురించి బయటపెట్టిన విశేషాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.* చివరి 40 నిమిషాలు సీట్లో కూర్చోలేరు.. ‘ఇరుముడి’పై అంచనాలు పెంచేసిన శివ నిర్వాణశంకరపల్లిలో 26 ఎకరాల మామిడి తోట.. రూ. వందల కోట్ల విలువ!రవితేజ దూరదృష్టిని ప్రస్తావిస్తూ అజయ్ ఘోష్ ఒక ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. గతంలో వారిద్దరూ కలిసి ‘మాస్ జాతర’ షూటింగ్ చేస్తున్న సమయంలో శంకరపల్లి సమీపంలోని ఒక 26 ఎకరాల మామిడి తోటలో రైల్వే స్టేషన్, ఇంటి సెట్స్ వేశారని గుర్తుచేశారు. ఆ తోట రవితేజదేనని, ఎప్పుడో కెరీర్ ప్రారంభంలో కేవలం రూ. 12 లక్షలకు కొనుగోలు చేయగా, ప్రస్తుతం దాని విలువ వందల కోట్లకు చేరిందని వెల్లడించారు. ఈ క్రమంలో రవితేజలోని తాత్విక కోణాన్ని వివరిస్తూ.. ‘‘సెట్లో ఓ వ్యక్తి ఆశ్చర్యపోతూ 'ఈ తోట విలువ ఇప్పుడు వందల కోట్లు అంట కదా సార్' అని అడిగితే.. దానికి రవితేజ చాలా తేలికగా నవ్వుతూ 'ఇవన్నీ ఇక్కడే ఉంటాయి.. మనమే పోతాం. ఇవి ఉన్నాయని సంతోషించాలి కానీ, ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి' అని బదులిచ్చారట. రవితేజలో కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, జిడ్డు కృష్ణమూర్తి లాంటి ఒక గొప్ప తాత్వికుడు కూడా కనిపిస్తాడు’’ అని అజయ్ ఘోష్ ప్రశంసించారు.ఇండస్ట్రీ ఎవడబ్బా సొత్తు కాదుపరిశ్రమలో ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా స్వశక్తితో అగ్రస్థానానికి చేరిన చిరంజీవి, రవితేజలను చూసి తాను ఎంతో నేర్చుకున్నానని అజయ్ ఘోష్ పేర్కొన్నారు. రవితేజ హిట్లు, ఫ్లాపులతో
నిమిత్తం లేకుండా నిరంతరం సినిమాలు చేస్తూ వేలాది మంది కార్మికులు, అసిస్టెంట్ డైరెక్టర్లు, టెక్నీషియన్లకు జీవనోపాధి కల్పిస్తారని కొనియాడారు. ‘చిత్ర పరిశ్రమ ఎవరి అబ్బా సొత్తు కాదు.. ప్రతిభ ఉన్న ఎవరికైనా ఇక్కడ స్థానం ఉంటుంది’ అని స్పష్టం చేస్తూ ‘రంగస్థలం’ వంటి చిత్రాలతో తనను ప్రోత్సహించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థను, సుకుమార్ను అభినందించారు.* * అభిమానానికి సరికొత్త నిర్వచనం.. సమాజ సేవలో ట్రెండ్ సెట్ చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్‘ఇరుముడి’లో రవితేజ విశ్వరూపంరవితేజ కెరీర్లో నిలిచిపోయిన ‘ఆటోగ్రాఫ్’, ‘నేనింతే’, ‘విక్రమార్కుడు’ చిత్రాల తరహాలో ‘ఇరుముడి’లో ఆయనలోని పూర్తి స్థాయి నటుడిని ప్రేక్షకులు చూస్తారని అజయ్ ఘోష్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా కూతురి కోసం నిలబడే ఒక బాధ్యతాయుతమైన మధ్యతరగతి తండ్రిగా రవితేజ నటన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందని, ప్రతి ఆడపిల్ల తమ తండ్రిని రవితేజ పాత్రలో చూసుకుంటుందని చెప్పారు. ఆగస్టు 21న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని మొబైల్స్లో లేదా పైరసీలో చూడకుండా, థియేటర్లలోనే చూసి ఆస్వాదించాలని యువతకు అజయ్ ఘోష్ పిలుపునిచ్చారు.