
ఎల్ నినో ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంలేదు... లోటు వర్షపాతం కొనసాగుతోంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతులు ముందుగా ప్లాన్ చేసుకున్న ఖరీఫ్ సాగు దెబ్బతినవచ్చు... ఇలా రైతులకు నష్టాలు తప్పేలా లేవు. కానీ ఒక పంట పోయినంత మాత్రాన సాగు అవకాశాలు పూర్తిగా మూసుకుపోయినట్లు కాదు... సెప్టెంబర్ నెలలో కురిసే వర్షాలు, భూమిలో ఉండే తేమ, నీటిపారుదల సౌకర్యాన్ని బట్టి తక్కువ కాలంలో కోతకు వచ్చే కొన్ని పంటలను ఎంచుకోవచ్చు. దీనివల్ల తక్కువ సమయంలోనే మంచి దిగుబడి సాధించి మంచి ఆదాయం పొందవచ్చు... ఖరీఫ్ పంటనష్టాన్ని పూడ్చుకోవచ్చు. ఖరీఫ్ సీజన్లో వేరుశనగ, పప్పుధాన్యాల వంటి కొన్ని పంటలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇవి వర్షాధార పంటలే అయినప్పటికి ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులు, నేల స్వభావాన్ని బట్టి రైతులు ఏది వేయాలో నిర్ణయించుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ నెలలో వేరుశనగ సాగును పరిశీలించవచ్చు... కానీ అన్ని జిల్లాలకు ఒకే రకమైన విత్తే సమయం సరిపోదు. కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య కాలాన్ని వేరుశనగకు అనువైనదిగా సిఫార్సు చేస్తారు. నేల స్వభావం, వర్షపాతం, నీటిపారుదల సౌకర్యాన్ని బట్టి సరైన రకాన్ని ఎంచుకోవాలి. కాబట్టి విత్తనాలు కొనే ముందు మీ జిల్లాకు సంబంధించిన వ్యవసాయ శాఖ సిఫార్సులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. కేవలం సీజన్ను చూసి హడావుడిగా విత్తనాలు వేయడం కంటే పొలంలో తగినంత తేమ ఉందో లేదో నిర్ధారించుకోవాలి. పెసలు, మినుములు వంటి పప్పుధాన్యాల పంటలు కూడా కొన్ని ప్రాంతాల్లో స్వల్పకాలిక సాగుకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా నీరు నిలవని నేలల్లో, అవసరమైన తేమ లభించే ప్రాంతాల్లో వీటిని ఎంచుకోవచ్చు. పొలంలో విత్తనాలు వేయడానికి ముందు సరైన పద్ధతిలో విత్తన శుద్ధి చేయాలి. దీంతో మొలకశాతం బాగుంటుంది, పంట తొలిదశలో ఆరోగ్యంగా పెరుగుతుంది. నేల స్వభావాన్ని బట్టి వీటిని ఏకపంటగా లేదా కొన్ని