
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Rb udhayakumar controversy comments on Trisha and cm Vijay: తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం సీఎం విజయ్, త్రిష చుట్టు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు అపోసిషన్ పార్టీల ఎత్తుగడల్ని సీఎం విజయ్ తనదైన స్టైల్ లో చిత్తు చేస్తున్నారు. ఎన్నికల వేళప్రజలకు ఇచ్చిన హమీల్ని నెరవేరుస్తు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం విజయ్ కు, త్రిషను లింక్ చేస్తే తరచుగా రాజకీయనేతలు చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఉదయ నిధి స్టాలీన్ వ్యాఖ్యల వివాదంపై రచ్చ నడుస్తునే ఉంది. కావేరీ జలాల అంశంపై మాట్లాడుతూ.. కార్యకర్తలు త్రిష పేరు ఎత్తగానే ఉదయనిధి స్టాలీన్ చాలా నీచంగా డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడాడు. దీనిపై టీవీకే పార్టీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఉదయ నిధిస్టాలీన్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ వివాదం సర్దుకోక ముందే మరో పార్టీకి చెందిన నేత మరల త్రిష,సీఎం విజయ్ పై వివాదాస్పదంగా మాట్లాడాడు. అన్నాడీఎంకే సీనియర్ నేత ఆర్బీ ఉదయకుమార్ కావేరీ జలాల విషయంలో తమిళనాడు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కర్ణాటకతో చర్చలు జరపడంతో తమిళనాడు ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ విషయం గురించి మాట్లాడుతూనే.. ముఖ్యమంత్రికి ఇష్టమైన నటి త్రిషను ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రాజుకుంది. ఆగస్టు 8న తూత్తుకుడిలో జరిగిన జయలలిత పేరవై సమావేశంలో ఉదయకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. కావేరీ జలాల వివాదంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని విమర్శిస్తూ సీఎం విజయ్ కు ఇష్టమైన త్రిషను