
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Hema fires on anasuya Bharadwaj over Jai Shri Ram Slogans row: ఇటీవల అనసూయ తరచుగా వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ.. కొంత మంది జై రామ్ ముసుగులో దాడులు చేస్తున్నారని అన్నారు. నినాదాల కంటే వ్యక్తి ప్రవర్తన గొప్పదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై రచ్చ రాజుకొవడంతో దీనిపై అనసూయ భరద్వాజ్ పై హిందు సంఘాలు బోరబండ పీఎస్ లో ఫిర్యాదు చేశాయి. దీంతో అనసూయ కాస్త తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. కొంత మంది కావాలని తన వ్యాఖ్యల్నివక్రీకరించారని అన్నారు. తనకు రాముడంటే ఇష్టమని, సనాతన ధర్మమంటే గౌరవమని చెప్పారు. తన కొడుకుకి హనుమాన్ పేరు పెట్టానని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అనసూయ ఎపిసోడ్ పై హిందూ సంఘాలు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నాయి. దీనిపై తాజాగా.. నటి హేమ రంగంలోకి దిగారు. సనాతన ధర్మంపై,జై రామ్ నినాదంపై అనసూయచేసిన వ్యాఖ్యల్ని ఏకీపారేశారు. అనసూయను గురించి మాట్లాడుతూ.. మనం అద్దాల మెడలో ఉంటున్నామని చెప్పారు. మాట్లాడేప్పుడు ప్రతి ఒక్క మాటలను జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. అనసూయ వ్యక్తిగత అంశాలు, ఆమె ధర్మం ఆమె ఇష్టమన్నారు. కానీ కొట్లాది మంది విశ్వాసాల్ని తక్కువ చేసే మాట్లాడే హక్కు అనసుయకు లేదన్నారు. శ్రీరామ్ అనేది నినాదం మాత్రమే కాదని, అది కోట్లాది మంది హిందువుల గుండెల్లో నిలిచిపోయిన పవిత్ర మంత్రమన్నారు. Read more: Anasuya Bharadwaj: చిక్కుల్లో అనసూయ భరద్వాజ్.!. బోరబండ పీఎస్ లో కేసు నమోదు.. మ్యాటర్ ఏమిటంటే..?.. ఒకవైపు