
ముంబై: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇటీవల బాలీవుడ్తో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు. షారుఖ్ ఖాన్ నటించిన ‘స్వదేశ’ సినిమాను 100 సార్లకు పైగా చూశానని, అందులోని మోహన్ పాత్ర తనను భారత్కు తిరిగి రావడానికి ప్రేరేపించిందని దీప్కే గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా చూసిన తర్వాత తన సమాజానికి సేవ చేయాలని అనుకున్నట్లు సీజేపీ నేత తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో తన స్వగ్రామం నుంచి “స్కూల్ ఠీక్ కరో” ప్రచారాన్ని ప్రారంభించిన తర్వాత అభిజీత్ దీప్కే ఎక్స్లో చిత్రాలను పోస్ట్ చేశారు. ఆయన ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి, సరిపడా కూర్చునే సదుపాయాలు, నీటి సరఫరా, కిటికీలు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సదుపాయాల్లో ఉన్న సమస్యలను ప్రస్తావించారు. దీప్కే ఎక్స్లో స్పందిస్తూ. “స్వదేశ సినిమా చూస్తూ పెరిగాను. ఆ సినిమాపై ఎంతో ప్రేమ ఏర్పడింది. ఇప్పటివరకు ఆ సినిమాను 100 సార్లకు పైగా చూసి ఉంటాను. ఆ సినిమాలోని ఒక భాగం ఎప్పుడూ నా మనసులో నిలిచిపోయింది. మోహన్ హరిదాస్ను కలవడానికి వెళ్లి, తన కుటుంబానికి కనీసం ఆహారం అందించడానికి కూడా అతను ఎంత కష్టపడుతున్నాడో చూస్తాడు. తిరిగి వస్తూ రైలులో కూర్చున్నప్పుడు, పాఠశాలలో ఉండాల్సిన ఓ చిన్న బాలుడు రైల్వే స్టేషన్లో నీళ్లు అమ్మడం చూస్తాడు. మోహన్ మౌనంగా కన్నీరు కార్చినప్పుడు నేను కూడా కన్నీరు పెట్టుకున్నాను. ప్రతిసారీ అలాగే జరిగింది” అని తెలిపారు. ‘స్వదేశ’లోని మోహన్లా.. సినిమాలో షారుక్ ఖాన్ పోషించిన మోహన్ పాత్రలా తాను కూడా తన గ్రామానికి ఏదైనా చేయాలని కోరుకున్నట్లు దీప్కే చెప్పారు. “అప్పటి నుంచి నా మనసులో ఎక్కడో ఒక మూల.. ఏదో ఒక రోజు మోహన్ చరణ్పూర్కు చేసినట్లే నేను కూడా నా సొంత గ్రామానికి ఏదైనా చేయాలని కోరుకున్నాను. కొన్నేళ్ల తర్వాత జీవితం ఇలాంటి మలుపు తిరిగి, అమెరికా నుంచి భారత్కు తిరిగి