
ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంతత, సంతోషం, లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉండాలని కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు నిలవకపోవడం, ఇంట్లో తరచూ గొడవలు జరగడం వంటివి జరుగుతుంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన పవిత్ర వస్తువులను సరైన దిశలో ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి, ఐశ్వర్యం, అదృష్టం తలుపు తడతాయి. ఆ ముఖ్యమైన వాస్తు వస్తువులు, వాటి సరైన దిశల వివరాలు ఇప్పుడు చూద్దాం... ప్రాముఖ్యత: వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్కు చాలా ప్రాధాన్యత ఉంది. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని పీల్చుకుని, సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. దిశ: మనీ ప్లాంట్ను ఎల్లప్పుడూ ఇంటికి ఆగ్నేయ దిశలో (South-East) ఉంచాలి. ఆగ్నేయ దిశకు అధిపతి గణపతి, గ్రహం శుక్రుడు కాబట్టి ఇది సిరిసంపదలను వేగంగా ఆకర్షిస్తుంది. అయితే... ఈ మొక్క ఆకులను ఎండిపోకుండా చూసుకోవాలి. మనీ ప్లాంట్ తీగలు నేల తాకకుండా జాగ్రత్త పడాలి.. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు శంఖం ఉద్భవించింది. అందుకే శంఖాన్ని లక్ష్మీదేవి సోదరిగా, పవిత్రతకు సంకేతంగా భావిస్తారు. పూజా మందిరంలో శంఖం ఉంచి పూజించడం లేదా ప్రతిరోజూ ఊదడం వల్ల వచ్చే ధ్వని కంపనాలు ఇంట్లోని దుష్టశక్తులను, వాస్తు దోషాలను తరిమికొడతాయి. పూజా గదిలో ఈశాన్య దిశలో బియ్యం లేదా నీటిపై శంఖాన్ని ఉంచడం శ్రేయస్కరం. ఇంటి సంతోషానికి, మానసిక ప్రశాంతతకు, ఆర్థిక పురోగతికి లాఫింగ్ బుద్ధ ప్రతీక.దీనిని ఇంటి ప్రధాన ద్వారంకు ఎదురుగా, కనీసం 30 ఇంచుల ఎత్తు ఉండేలా టేబుల్ లేదా స్టాండ్ పై ఉంచాలి. ఇల్లు దాటి లోపలికి వచ్చే ప్రతికూల శక్తిని ఇది నిరోధిస్తుంది. దీనిని ఎప్పుడూ నేరుగా నేలపై లేదా బెడ్రూమ్, బాత్రూమ్ల దగ్గర ఉంచకూడదు. నెమలి ఈకలు లక్ష్మీదేవి , శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని ఇస్తాయి. ఇవి ఇంట్లోని రాహు దోషాలను, ఆర్థిక ఇబ్బందులను తొలగించడంలో సహాయపడతాయి. ఇంట్లోని దక్షిణాగ్నేయ