© 2026 nimisham.in

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Railways Approves 7 New Amrit Bharat Express: అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లడం వల్ల ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది. లోయర్, మిడిల్ క్లాస్ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లను ప్రవేశపెట్టారు. ఇవి సుదీర్ఘ ప్రయాణాలను తక్కువ సమయంలో పూర్తి చేయడమే కాకుండా, ప్రీమియం రైలు సర్వీసుల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. ఉత్తర, మధ్య, పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ మొత్తం 7 రైళ్ల కనెక్టివిటీకి రైల్వే బోర్డు అనుమతి తెలిపింది. ఆ రైళ్లు ఏ రూట్లలో వెళ్తాయో చూద్దాం. ధన్ బాద్ నుంచి కోయంబత్తూర్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.. రైల్వే బోర్డు ధన్ బాద్ నుంచి కోయంబత్తూర్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను మంజూరు చేసింది. ట్రైన్ నంబర్ 22363/ 22364 కలిగిన ఈ రైలు ధన్ బాద్ జంక్షన్ నుంచి ఎన్.ఎస్.ఈ బోస్ జంక్షన్, పరాశనాద్, హజారీబాగ్ రోడ్డు, కోడెర్మా, గయా, అనుగ్రహ నారాయణ రోడ్డు, డెహ్రాసారాం, దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, మీర్జాపూర్, ప్రయాగ రాజ్, కాట్నీ, జబల్పూర్, నర్సింగ్ పూర్, పిపారియా, ఇటార్సీ, బేతుల్, నాగపూర్, చంద్రపూర్, బాలార్ష, సిర్పూర్, కాగజ్ నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుత్తని, కార్డ్పాటి, జోలర్, పెట్టాయి, సేలం, ఈరోడ్ మరియు తిరుప్పుర్ మీదుగా వెళ్తుంది. ప్రయాగరాజ్ నుంచి లోకమాన్య తిలక్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.. మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇది ప్రయాగరాజ్ నుంచి
లోకమాన్య తిలక్ టెర్మినస్ వరకు నడుస్తుంది. ట్రైన్ నంబర్ 20164/20435 కలిగిన ఈ వీక్లీ సర్వీస్ సాత్నా, జబల్పూర్, భూస్వల్, కళ్యాణ్ వద్ద ఆగుతుంది.
ప్రయాగరాజ్ - ఉదయ్పుర్ అమృత్ భారత్.. అదనంగా ప్రయాగరాజ్ నుంచి ఉదయ్పుర్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నంబర్ 20137/20438) కి కూడా ఆమోదం లభించింది. ఇది ప్రయాగరాజ్, ఫతేపూర్, గోవిందపురి, ఇతవా, తుండ్ల, అగ్ర, బయాన, హిందువు వన్ సిటీ, గంగాపూర్ సిటీ, సవాయి మాధవపూర్, కోట, రామ్ గంజ్ మండి, భవాని మండి రాత్లం, వడోదర మీదుగా ప్రయాణిస్తుంది.
సుబేదార్గాంజ్ నుంచి లోకమాన్య తిలక్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.. రైల్వే మంత్రిత్వ శాఖ సుబేదార్గాంజ్ నుంచి లోకమాన్య తిలక్ టెర్మినస్ వరకు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రైన్ నంబర్ 14121/14122 కలిగిన ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ గోవిందపురి, బరువ, సమీర్పూర్, రాఘవల్ బంద్, చిత్రకూటం, కార్వీ, సాత్నా, జబల్పూర్, నర్సింగాపూర్, పిపారియా, ఇటార్సీ, ఖాన్వా, భూసావల్, నాసిక్ రోడ్డు, కళ్యాణ్ వరకు ఆగుతుంది.
గోరఖ్ పూర్ నుంచి ఢిల్లీ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.. ఎంతో రద్దీగా ఉండే గోరఖ్ పూర్ వంటి ప్రాంతాల నుంచి కూడా అమృత్ భారత్ రైళ్లకు బోర్డు ఆమోదం తెలిపింది. గోరఖ్ పూర్ నుంచి ఢిల్లీకి వెళ్లే అమృత్ భారత్ రైలు (ట్రైన్ నంబర్ 15955/ 15956) వీక్లీ ఎక్స్ప్రెస్. ఇది గోరఖ్ పూర్, కలిరాబాద్ బస్తీ, బోండా, భరావహర్, సీతాపూర్, బరేలీ, మురదాబాద్, ఘజియాబాద్, ఢిల్లీ మీదుగా వెళుతుంది.
గోరఖ్పూర్ - బాంద్రా ఎక్స్ప్రెస్.. గోరఖ్పూర్ నుంచి మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. ట్రైన్ నంబర్ 15855/ 15856 కలిగిన ఈ రైలు బాంద్రా టెర్మినస్ వరకు వెళ్తుంది. ఇది గోరఖ్పూర్, ఖలీదాబాద్, బస్తిగొండ, బాద్షా నగర్, ఆయేషాబాద్, కాన్పూర్ సెంట్రల్, తుండ్ల, అగ్ర ఫోర్ట్, వయాన, గంగాపూర్ సిటీ, కోట, భవాని మండి, షామార్క్, రాత్లం, వడోదర, సూరత్, వలస, వాపి, ఫాల్గర్, బోరివలి మీదుగా బాంద్రా చేరుకుంటుంది.
చర్లపల్లి నుంచి గోరఖ్ పూర్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.. చివరిగా, చర్లపల్లి నుంచి గోరఖ్ పూర్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నంబర్ 22075/ 22076) అందుబాటులోకి రానుంది. ఇది చర్లపల్లి, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బాలార్షా, చంద్రపూర్, నాగపూర్, బేతుల్, ఇటార్సీ, భోపాల్, బినా, విరంగన, లక్ష్మీబాయి ఝాన్సీ, ఓరాయి, ఫోక్రాయన్, కాన్పూర్ సెంట్రల్, ఐషాబాద్, లక్నో సిటీ, గోమతి నగర్, బారాబంకి మీదుగా గోరఖ్ పూర్ చేరుకుంటుంది. ఈ 7 అమృత్ భారత్ రైళ్లు ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు ప్రారంభిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.