© 2026 nimisham.in

మణిపూర్లోని కాంగ్పోక్పి జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున మళ్లీ హింస చెలరేగింది. ఆయుధాలతో వచ్చిన దుండగులు మూడు లియాంగ్మై నాగ గ్రామాలపై దాడి చేయడంతో కనీసం 30 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఓ గ్రామస్థుడికి బుల్లెట్ గాయం అయినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 4 గంటల సమయంలో టాపోన్ ఖుల్లెన్, టాపోన్ ఖునౌ, మకుయి పిపురామ్ గ్రామాల్లో దాడి జరిగింది. దుండగులు కాల్పులు జరిపి ఇళ్లు, ఇతర ఆస్తులకు నిప్పుపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకునేలోపే భారీగా ఆస్తి నష్టం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం, దాని కోబ్రా విభాగంతో పాటు మణిపూర్ పోలీసు సిబ్బందిని అదనంగా మోహరించారు. అనంతరం గ్రామాల చుట్టుపక్కల భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇరువైపుల నుంచి కాల్పులు పలు గంటల పాటు కొనసాగి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆగినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలిని పరిశీలించిన భద్రతా సిబ్బందికి ఇళ్లు, వాహనాలు, ఇతర వస్తువులు భారీగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అయితే మొత్తం నష్టం ఎంత, ఎన్ని ఆస్తులు ప్రభావితమయ్యాయనే దానిపై అంచనా ఇంకా కొనసాగుతోంది. ఈ ఘటనకు ఒక రోజు ముందు, కాంగ్పోక్పి జిల్లాలోని టెయిఖాంగ్ కుకీ గ్రామంపై దాడి జరిగింది. అందులో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు పౌరులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. వరుస దాడులతో ఇంఫాల్ తమెంగ్లాంగ్ రహదారి పరిసరాల్లో ప్రతీకార దాడులపై ఆందోళనలు పెరిగాయి. కుకీ జో, నాగ వర్గాల మధ్య గతంలోనూ వరుస దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకున్నాయి. మే 13 నుంచి ఈ రెండు వర్గాలకు చెందిన 17 మంది వేర్వేరు ఘటనల్లో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 27న జరిగిన దాడిలో నలుగురు నాగ పౌరులు, ఆగస్టు 31న కాంగ్పోక్పి-తమెంగ్లాంగ్ పరిసరాల్లో జరిగిన దాడిలో ముగ్గురు కుకీ పౌరులు మృతి చెందినట్లు సమాచారం. తాజా
Sep 1 2026 7:38 PM | Updated on Sep 1 2026 7:50 PM
మణిపూర్లోని కాంగ్పోక్పి జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున మళ్లీ హింస చెలరేగింది. ఆయుధాలతో వచ్చిన దుండగులు మూడు లియాంగ్మై నాగ గ్రామాలపై దాడి చేయడంతో కనీసం 30 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఓ గ్రామస్థుడికి బుల్లెట్ గాయం అయినట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 4 గంటల సమయంలో టాపోన్ ఖుల్లెన్, టాపోన్ ఖునౌ, మకుయి పిపురామ్ గ్రామాల్లో దాడి జరిగింది. దుండగులు కాల్పులు జరిపి ఇళ్లు, ఇతర ఆస్తులకు నిప్పుపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకునేలోపే భారీగా ఆస్తి నష్టం జరిగింది.
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం, దాని కోబ్రా విభాగంతో పాటు మణిపూర్ పోలీసు సిబ్బందిని అదనంగా మోహరించారు. అనంతరం గ్రామాల చుట్టుపక్కల భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇరువైపుల నుంచి కాల్పులు పలు గంటల పాటు కొనసాగి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆగినట్లు అధికారులు తెలిపారు.
ఘటనాస్థలిని పరిశీలించిన భద్రతా సిబ్బందికి ఇళ్లు, వాహనాలు, ఇతర వస్తువులు భారీగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అయితే మొత్తం నష్టం ఎంత, ఎన్ని ఆస్తులు ప్రభావితమయ్యాయనే దానిపై అంచనా ఇంకా కొనసాగుతోంది. ఈ ఘటనకు ఒక రోజు ముందు, కాంగ్పోక్పి జిల్లాలోని టెయిఖాంగ్ కుకీ గ్రామంపై దాడి జరిగింది. అందులో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు పౌరులు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. వరుస దాడులతో ఇంఫాల్ తమెంగ్లాంగ్ రహదారి పరిసరాల్లో ప్రతీకార దాడులపై ఆందోళనలు పెరిగాయి. కుకీ జో, నాగ వర్గాల మధ్య గతంలోనూ వరుస దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకున్నాయి.
మే 13 నుంచి ఈ రెండు వర్గాలకు చెందిన 17 మంది వేర్వేరు ఘటనల్లో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 27న జరిగిన దాడిలో నలుగురు నాగ పౌరులు, ఆగస్టు 31న కాంగ్పోక్పి-తమెంగ్లాంగ్ పరిసరాల్లో జరిగిన దాడిలో ముగ్గురు కుకీ పౌరులు మృతి చెందినట్లు సమాచారం. తాజా దాడులకు ఇప్పటివరకు ఏ వర్గమూ అధికారికంగా బాధ్యత ప్రకటించలేదు.
ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచి గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. నష్టం అంచనా, కాల్పులు-దహనం ఘటనల దర్యాప్తు, దాడికి పాల్పడినవారి గుర్తింపు ఇప్పుడు అధికారుల ముందున్న ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
ట్రేడిషనల్ శారీలో బిగ్బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు
మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)
తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)
హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)
భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్
సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు
పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా
అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్