
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్ల పాలన మొదలై ఐదేళ్లు గడుస్తున్నా.. అక్కడి మహిళలకు, బాలికలకు అంధకార స్థితి మారలేదు. ఆధునిక ప్రపంచం సాంకేతికతతో దూసుకుపోతుంటే, ఒక పూర్తి తరానికి చెందిన ఆడపిల్లలను బడికి రాకుండా నిరోధించిన ఏకైక దేశంగా ఆఫ్ఘనిస్థాన్ మిగిలిపోయింది.హైస్కూల్, పైచదువుల గుమ్మం తొక్కకుండా తాలిబాన్లు విధించిన ఆంక్షల వల్ల దాదాపు 24 లక్షల మంది బాలికలు చదువుకు దూరమయ్యారని ఐక్యరాజ్యసమితికి చెందిన యునెస్కో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనల పేరుతో ఓ తరం బాలికల జీవితాలను సర్వనాశనం చేయడం ప్రాథమిక మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘన కిందకే వస్తుందని తెగేసి చెప్పింది.ఒక్క నిర్ణయంతో 20 ఏళ్ల కష్టం బూడిదపాలు..2021 ఆగస్టులో అమెరికా, నాటో దళాలు దేశాన్ని వీడటంతో అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు, మొదట హైస్కూల్ స్థాయి బాలికలపై నిషేధం విధించారు. ఆ తర్వాత క్రమంగా యూనివర్సిటీలు, ఉద్యోగాలు , పబ్లిక్ లైఫ్ నుంచి మహిళలను పూర్తిగా పక్కనబెట్టేశారు. 2001 నుంచి 2021 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్థాన్లో మహిళా విద్య ఎంతో మెరుగైంది. అప్పట్లో దాదాపు 10 లక్షల మంది వరకు బాలికలు బడులకు వెళ్లే స్థాయికి వ్యవస్థ మారింది. కానీ, తాలిబాన్ల కొత్త ఆంక్షలతో గత రెండు దశాబ్దాలుగా సాధించిన పురోగతి అంతా ఒక్కసారిగా కొట్టుకుపోయిందని యునెస్కో ప్రతినిధి హోదా జబేరియన్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచదేశాల ఒత్తిళ్లను త్రోసిపుచ్చిన తాలిబన్లు..ఐక్యరాజ్యసమితితో పాటు మానవ హక్కుల సంఘాలు, అంతర్జాతీయ సమాజం , పలు ఇస్లామిక్ దేశాలు ఎంత మొరపెట్టుకున్నా తాలిబాన్ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బాలికల చదువు తమ అంతర్గత వ్యవహారమని, ఇందులో విదేశీ ప్రమేయం అవసరం లేదని సమర్థించుకుంటోంది.బాలికలకు విద్యకు పూర్తిగా దూరం చేసిన ఏకైక దేశంఅయితే, ఐదేళ్ల కాలమనేది పిల్లల విద్యా జీవితంలో చాలా పెద్దదని, ఇది ఏదో తాత్కాలిక విరామం కాదని, ఒక పూర్తి విద్యా సంత్సరాల చక్రాన్నే నాశనం చేయడమని యునెస్కో స్పష్టం చేసింది. బాలికలకు