© 2026 nimisham.in

ఇంటర్నెట్ డెస్క్: నేపాల్ వరద విలయం (Nepal floods)లో ఇంకా వేలమంది ఆచూకీ తెలియడం లేదు. భవన శిథిలాలు, పేరుకుపోయిన బురద కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీయడానికి సహాయక బృందాలు కృషి చేస్తున్నాయి. వరద ధాటికి శిథిలమైన నువాకోట్లోని ఓ భవనంలో 23 మృతదేహాలు లభ్యమైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. అవన్నీ కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో ఖననం చేయడానికి తరలించారు. నేపాల్ చైనా సరిహద్దులో ఇప్పటి వరకు లభ్యమైన మృతదేహాల సంఖ్య 978కు చేరింది. నేపాల్, టిబెట్లలో కలిపి మొత్తం 4,471 మంది గల్లంతయ్యారు. భారత్, చైనా, సింగపూర్, దక్షిణ కొరియా సహా ఇతర దేశాల నుంచి అందిన మద్దతుతో నేపాల్ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. రసువా, నువాకోట్లలోని సుమారు 6 సొరంగాలు, 11 ప్రాజెక్టులలో 930 మందికిపైగా కార్మికులు చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. ఆయా ప్రాంతాలను చేరుకునేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సొరంగం చుట్టూ పేరుకుపోయిన దట్టమైన బురద, ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. తప్పిపోయిన తమ కుటుంబ సభ్యుల జాడ కోసం వెతుకుతున్న వేలాది మంది ప్రజలతో ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు కిక్కిరిసిపోయాయి. ఆసుపత్రులలో ఒకే మృతదేహాన్ని తమ బంధువుగా పేర్కొంటూ పలు కుటుంబాలు వస్తుండడంతో మృతదేహాల గుర్తింపులో జాప్యం జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. ఇటువంటి సమస్యలు నివారించడానికి అన్ని మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నేపాల్ నుంచి ఉత్తర్ప్రదేశ్లోని గండక్ నదిలోకి 13 మృతదేహాలు కొట్టుకువచ్చినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. వాటిని తిరిగి ఆ దేశానికి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత
లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.