అతనికి ఊరికో పేరు ఉంటుంది. ప్రత్యేకమైన పని అంటూ ఏమీ లేదు. దొంగతనం చేశామా.. పబ్బం గడుపుకొన్నామా అంతే! మూడు రాష్ట్రాల్లో 18 నేరాలకు పాల్పడ్డాడు. కానీ, అతనిపై ఇప్పటిదాకా ఒక్క హిస్టరీ లేదు. ఇతనే దొంగ అని ఒక్క రాష్ట్రంలో కూడా కేసు నమోదు కాలేదు. ఒంగోలు లో ఒకేరోజు రెండు చోరీలు చేయడంతో అతని పాపం పండింది. అతని నుంచి రూ. 1.03 కోట్ల విలువైన బంగారం, నగదు, కారును స్వాధీనం చేసుకుని ఒంగోలు పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు.ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు నార్త్ వినాయక నగర్, గెద్దల హళ్లి, ఇలయాస్ మజీద్ ప్రాంతానికి చెందిన సొహైల్ ఖాన్కు అనేక పేర్లు ఉన్నాయి. ఊరికో పేరుతో అతను చెలామణి అవుతున్నాడు. సొహైల్ ఖాన్ అలియాస్ మహ్మద్ సమీర్ఖాన్ అలియాస్ సమీర్ ఖాన్ అలియాస్ పఠాన్ సమీర్ ఖాన్ అలియాస్ సోహెబ్ ఖాన్ ఇలా చాలా పేర్లు ఉన్నాయి ప్రస్తుతం హైదరాబాద్ చాంద్రాయణగుట్ట షాహిద్నగర్లో నివాసం ఉంటున్నాడు. కర్ణాటక, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇతను చేసిన చోరీలపై కేసులు నమోదయ్యాయి.READ ALSO ఒంగోలులో పక్కా ప్లాన్తో సీబీఐ రైడ్.. గ్రానైట్ వ్యవహారంలో లంచం తీసుకుంటున్న, లంచం ఇస్తున్న ఇద్దరూ అరెస్ట్ఆగస్టు 5వ తేదీన ఒంగోలు నగరంలోని ఆంధ్రకేసరి నగర్, సమతానగర్లో రెండు భారీ చోరీలు జరిగాయి. ఆంధ్రకేసరి నగర్లో 146 గ్రాముల బంగారం, రూ. 5 లక్షల నగదు.. సమతానగర్లో 248 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి జల్లెడ పట్టారు. మరో చోరీ కోసం ఒంగోలు వస్తున్న నిందితుడిని స్థానిక సౌత్ బైపాస్ కూడలిలో అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.READ ALSO ఎస్సైల కారులో గంజాయి.. "హే రామ్.. రాష్ట్రం ఎంత దిగజారిపోయింది" అన్న వైఎస్ జగన్దొంగతనాలు చేసి ఆ