గత ఏడేళ్లుగా చాలా బాధపడ్డా.. మళ్లీ హిట్టు కొడతానో లేదో అనే డౌట్ ఉండేది
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఈ హారర్ కామెడీ.. ఇటీవలే థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో రేసులో వెనకబడిపోయిన వరుణ్.. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. అయితే గత ఏడేళ్లుగా సినిమాలు ఆశించి స్థాయిలో ఆడకపోవడంతో బాధ పడ్డానని, తాను మళ్లీ హిట్ కొడతానని అనుకోలేదని వరుణ్ చెబుతున్నారు.శుక్రవారం సాయంత్రం వైజాగ్ లో 'కొరియన్ కనకరాజు' మెగా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ''కొరియన్ కనకరాజు సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు వైజాగ్ తో మంచి అనుబంధం ఉంది. నా యాక్టింగ్ శిక్షణ అంతా ఇక్కడ మా సత్యానంద్ గారి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేశాను. మళ్ళీ ఇక్కడికి రావడం, ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా హ్యాపీగా ఉంది. ఒక సినిమా సక్సెస్ వెనుక ఎంతో మంది కృషి ఉంటుంది. ఈ సినిమాలో పని చేసిన మా టీంలోని ప్రతి ఒక్కరికి నేను థాంక్స్ చెప్తున్నా'' అని అన్నారు.''గాంధీ, నేనూ.. డైరెక్టర్ హీరోలా కాకుండా ఇద్దరు ఫ్రెండ్స్ లాగా పని చేసాం. అదే ఈరోజు ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి కారణమని అనుకుంటున్నాను. మళ్ళీ తప్పకుండా కలిసి సినిమా చేస్తాం. మా ప్రొడ్యూసర్స్ యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ థాంక్యూ సో మచ్. సినిమాకి పనిచేసిన వారందరికీ పేరు పేరునా పెద్ద థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ 'ఓజీ' నుంచి దుమ్ము లేపుతున్నాడు. నాకు OG లెవెల్ వద్దులే కానీ, ఎంతో కొంత ఇవ్వమని తమన్ ని అడిగాను. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాకి పిల్లర్ గా నిలిచాడు. రితికా