
నా గుండెల్లో మంట తట్టుకోలేకపోయా..150 కేజీల ఐస్ లో కూర్చున్న’.. హేమ కామెంట్స్
Actress Hema:తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి, అక్క, పిన్ని, వదిన వంటి ఎన్నో పాత్రల్లో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కామెడీ పాత్రల్లో కూడా తనదైన శైలితో నవ్వించారు. సినిమాలతో పాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్కు సంబంధించిన విషయాల్లో కూడా హేమ చురుగ్గా కనిపించారు. హేమ ఏ విషయం గురించి మాట్లాడినా తన అభిప్రాయాన్ని నేరుగా చెప్పే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆమెకు సంబంధించిన వ్యాఖ్యలు తరచూ సోషల్ మీడియాలో చర్చకు వస్తుంటాయి. తాజాగా ఆమె గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.తనపై కేసు నడిచిన సమయంలో తాను చాలా ఒత్తిడికి గురయ్యానని హేమ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తనలో చాలా కోపం, బాధ ఉండేవని తెలిపారు. ఆ భావోద్వేగాలను బయటకు చెప్పుకోలేకపోతే తాను తీవ్రంగా ఇబ్బంది పడతానని అనిపించిందని ఆమె వివరించారు. అలాంటి సమయంలో ఐస్ బాత్ థెరపీని ప్రయత్నించినట్లు హేమ తెలిపారు. పెద్ద మొత్తంలో మంచుతో నింపిన నీటిలో కూర్చుని తనలో ఉన్న కోపాన్ని, బాధను బయటకు వెళ్లగక్కినట్లు చెప్పారు. అలా చేయడం ద్వారా తన మనసులో ఉన్న భారాన్ని కొంత తగ్గించుకున్నానని వివరించారు. ఐస్ బాత్కు ముందు కౌన్సిలింగ్ వంటి సెషన్స్లో కూడా పాల్గొన్నానని హేమ చెప్పారు. తనలాంటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికి ఉపయోగపడేలా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచన కూడా తనకు వచ్చిందని తెలిపారు. అదే సమయంలో మీడియా తన గురించి వార్తలు రాసిన తీరుపై కూడా హేమ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణల సమయంలో కొన్ని వార్తలు ఎక్కువగా ప్రచారం అయ్యాయని, తరువాత జరిగిన పరిణామాలకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదని ఆమె అన్నారు. తనకు విష్ణు బాబు అండగా నిలిచారని హేమ పేర్కొన్నారు. ఆధారాలు చూపించిన తర్వాత తాను తిరిగి