
జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
Tirupati District Pulse Polio: జిల్లాలోని ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలి. జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ నిర్వహణకు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం ఈ నెల 28,29,30 వ తేదీలలో జరగబోవు జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరం నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. బాలకృష్ణ నాయక్ తో కలిసి జిల్లాలో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. Read Also : Gudivada Amarnath Allegations:హోంమంత్రి అనితపై వ్యాఖ్యల కలకలం.. గుడివాడ అమర్నాథ్పై పోలీస్ స్టేషన్లో కేసు! ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలు, పోలియో బూత్ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, అవగాహన కార్యక్రమాలు, వ్యాక్సిన్ నిల్వలు, రవాణా ఏర్పాట్లు, పర్యవేక్షణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా 0 నుండి 5 సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి రెండు పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. అర్బన్ ప్రాంతంలో మరియు పర్యాటక ప్రదేశాలలో పిల్లలు పోలియో చుక్కలు వేయించుకోకుండా మిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని అలాంటి వారిపై దృష్టి సారించి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలియో బూత్లతో పాటు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల ద్వారా అర్హులైన చిన్నారులను గుర్తించి వారికి పోలియో చుక్కలు వేయించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలోని ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు అందించేందుకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని